షేక్ చేస్తున్న చిరంజీవి రెమ్యూనరేషన్..
- February 05, 2017
'ఖైదీ నెంబర్ 150' కలక్షన్స్ హవా ముగియడంతో ఇప్పుడు మెగా అభిమానులకు బుల్లితెర పండుగ ప్రారంభం కాబోతోంది. మెగా అభిమానులు అంతా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న చిరంజీవి 'మీలో ఎవరు కోటీశ్వరుడు' 4వ సీజన్ కార్యక్రమ టెలికాస్టింగ్ కు కౌంట్ డౌన్ మొదలైంది. ఈ షో టెలికాస్టింగ్ ను ఫిబ్రవరి 13, 2017 రాత్రి 9.30 గంటల నుంచి ప్రారంభించడానికి మాటివి యాజమాన్యం ఏర్పాట్లు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.
దీనితో ఈ షో గురించి అంచనాలు పెరిగిపోవడమే కాకుండా ఈకార్యక్రమ తొలి షోకు టీఆర్పీ రేటింగ్స్ ఏ రేంజిలో వస్తాయో అంటూ చర్చలు జరుగుతున్నాయి. మెగాస్టార్ చిరంజీవితో హోస్ట్ చేస్తున్న షో కాబట్టి గతంలో తెలుగు టెలివిజన్ చరిత్రలో ఎన్నడూ రాని విధంగా భారీగా టీఆర్పీ రేటింగ్స్ వస్తాయని అంచనాలు వేస్తున్నారు.
ఇప్పటికే ఈ షోకు సంబంధించిన కొన్ని ఎపిసోడ్స్ రికార్డింగ్ పూర్తి అయింది. మరొక ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈ కార్యక్రమం నిర్వహిస్తున్న చిరంజీవికి ప్రతి ఎపిసోడ్కు పదిలక్షల రూపాయలు రెమ్యూనరేషన్ గా ఇస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. దక్షిణ భారత బుల్లితెర రంగానికి సంబంధించి ఏ ఛానల్ కూడ ఈ స్థాయిలో పారితోషికం ఒక ప్రోగ్రాం ప్రజంటర్ కు ఇచ్చిన దాఖలాలు లేవు అని అంటున్నారు.
ఇప్పటికే 'ఖైదీ' సూపర్ సక్సస్ తో తారాస్థాయికి చేరుకున్న చిరంజీవి క్రేజ్ ఈ బుల్లితెర షోతో మరింత పెరిగి పోతుంది అని భావించడంలో ఎటువంటి సందేహం లేదు. ఈ పరిస్థుతులను బట్టి చూస్తూ ఉంటే సినిమాల పరంగా మాత్రమే కాకుండా బుల్లితెర పై కూడ మెగా స్టార్ ప్రభంజనం ఈ సంవత్సరం అంతా కొనసాగే ఆస్కారం ఉంది.
తాజా వార్తలు
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్కు అంతర్జాతీయ గుర్తింపు..!!
- సోషల్ మీడియా బ్యాన్.. క్రియేటర్ ఎకానమీపై ప్రభావంపై యూఏఈ క్లారిటీ..!!







