తెలుగు రాష్ట్రాల్లో శాసనమండలి ఎన్నికల నగారా మోగింది..
- February 06, 2017
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో శాసనమండలి ఎన్నికల నగారా మోగింది. సోమవారం ఎన్నికల సంఘం ఎన్నికల షెడ్యూల్ను విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ పట్టభద్రుల నియోజకవర్గం, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో పట్టభద్రులు, ఉపాధ్యాయుల నియోజకవర్గాలతో పాటు కడప, అనంతపురం, కర్నూలు జిల్లాల పట్టభద్రులు, ఉపాధ్యాయుల నియోజకవర్గాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు.
తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్నగర్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నిక జరపనున్నారు. .
ఈ ఎన్నికలకు ఫిబ్రవరి 13న నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు.
నామినేషన్ల స్వీకరణకు తుది గడువు ఫిబ్రవరి 20 కాగా, ఫిబ్రవరి 21న నామినేషన్లను పరిశీలించనున్నారు. నామినేషన్ల ఉపసంహరణ గడువును ఫిబ్రవరి 23గా నిర్ణయించారు. అయితే, మార్చి 9న ఇరు రాష్ట్రాల్లోని ఆయా స్థానాల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. ఉదయం 8గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు పోలింగ్ జరగనుంది.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







