చంద్రబాబు క్యాబినెట్ పునర్ వ్యవస్థీకరణలో మరో నలుగురు నేతలు
- February 07, 2017
ఉగాదికి ముందు జరిగే చంద్రబాబు క్యాబినెట్ పునర్ వ్యవస్థీకరణ భాగంగా నలుగురు నేతలు పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. ఇప్పటికే లోకేష్ బెర్త్ ఖాయంకాగా, మరో ముగ్గురు నేతలు ఎవరన్నది ఆసక్తిగా మారింది. విశ్వసనీయ సమచారం మేరకు ఆ ముగ్గురు వైసీపీ నుంచి వచ్చిన తెలుగుదేశం నేతలని తెలుస్తోంది. అమరనాథ్రెడ్డి (చిత్తూరు జిల్లా), సుజయ్ రంగారావు (విజయనగరం), భూమానాగిరెడ్డి (కర్నూలు).. ఈ ముగ్గురినీ కేబినెట్లో తీసుకోవాలని చంద్రబాబు ఫిక్సయినట్టు తెలుస్తోంది. ఐతే ప్రతిపక్ష పార్టీ తరపున గెలిచి క్యాబినెట్ మంత్రిగా చెలామణి అవడమనేది ఇక్కడ ఎదురయ్యే తొలి సమస్య. దీనికి కూడా చంద్రబాబు పరిష్కారాన్ని సిద్ధం చేసుకున్నారు. ముగ్గురు ఎమ్మెల్యేలను రాజీనామా చేయించిన తర్వాత మంత్రులుగా ప్రమాణ పత్రాల్ని చదవించాలన్నది బాబు ఆలోచనగా పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ మూడు నియోజకవర్గాల్లో జరిగే బైపోల్లో 'ముగ్గురు మంత్రుల్ని' గెలిపించుకోవడం పార్టీ భుజాల మీద వుండే భారం.
తాజా వార్తలు
- కువైట్ లో స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- యూత్ సిటీ 2030కు ఎన్బీబీ ప్లాటినం స్పాన్సర్..!!
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన ఖతార్..!!
- ఈ-స్కూటర్లు, సైకిళ్ల నిబంధనలు ఉల్లంఘిస్తే Dh500 వరకు జరిమానా..!!
- అరేబియా సముద్రంలో 4.9 తీవ్రతతో భూకంపం..ఒమన్ లో ప్రభావంపై క్లారిటీ..!!
- సౌదీలో సొంతింటి కల సాకారం.. 66.24% నికి చేరిన హోం ఓనర్షిప్..!!
- అవయవదానంతో 12 మందికి పునర్జన్మ.. నలుగురు చిన్నారులకు కొత్త జీవితం..!!
- అమెరికా–ఇరాన్ ఘర్షణలు తీవ్రం..
- కువైట్ గగనతలంలో క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న వైమానిక రక్షణ వ్యవస్థలు
- సోనమ్ వాంగ్చుక్ నిరాహార దీక్ష భగ్నం..!







