పాకిస్థాన్‌లో ఉగ్రదాడి

- February 07, 2017 , by Maagulf
పాకిస్థాన్‌లో ఉగ్రదాడి

పాకిస్థాన్‌లోని ఖైబర్‌ పంఖ్తుఖ్వా ప్రాంతంలోని బన్ను జిల్లాలో ఉగ్ర దాడి జరిగింది. బన్నులోని మదన్‌ పోలీస్‌ స్టేషన్‌ వద్ద ఓ ఉగ్రవాది పేలుడు పదార్థాలతో నింపి ఉన్న వాహనంతో వేగంగా వచ్చి స్టేషన్‌ గేట్‌కు ఢీకొట్టాడు. దీంతో పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఉగ్రవాది మరణించగా, గేటు వద్ద విధులు నిర్వహిస్తున్న ఇద్దరు పోలీసులు గాయాలపాలయ్యారు. వారిని వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com