తల్లిదండ్రులను సరిగ్గా చూసుకోకపోతే జీతం కట్.!!
- February 08, 2017
తల్లిదండ్రుల బాధ్యతలను పట్టించుకోకపోతే ఇకపై ఉద్యోగుల జీతం కట్ కానుంది. ఈమేరకు ఓ చట్టం చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. పిల్లలను కని, పెంచి, పెద్ద చేసిన తల్లిదండ్రులు వృద్ధాప్యంలో అనేక బాధలు పడుతున్నారు. ఆస్తులు దక్కించుకున్న కొడుకులు ఆ తర్వాత వారి పట్ల నిర్లక్ష్యం వహిస్తున్నారు. దీంతో నేటి సమాజంలో చాలా మంది తల్లిదండ్రులు మలి వయసులో అష్టకష్టాలు పడుతున్నారు. ఈనేపథ్యంలో అసోం ప్రభుత్వం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. పేరెంట్స్ పట్ల నిర్లక్ష్యం వహించే ప్రభుత్వ ఉద్యోగుల వేతనం నుంచి కొంత మొత్తం మినహాయించనుంది. దీన్ని తల్లిదండ్రుల సంరక్షణకు వినియోగించనుంది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో దీనికి సంబంధించిన బిల్లును ప్రవేశపెట్టనున్నట్లు అసోం ఆర్ధిక మంత్రి హిమంత బిశ్వ శర్మ తెలిపారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







