తల్లిదండ్రులను సరిగ్గా చూసుకోకపోతే జీతం కట్.!!

- February 08, 2017 , by Maagulf
తల్లిదండ్రులను సరిగ్గా చూసుకోకపోతే జీతం కట్.!!

తల్లిదండ్రుల బాధ్యతలను పట్టించుకోకపోతే ఇకపై ఉద్యోగుల జీతం కట్ కానుంది. ఈమేరకు ఓ చట్టం చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. పిల్లలను కని, పెంచి, పెద్ద చేసిన తల్లిదండ్రులు వృద్ధాప్యంలో అనేక బాధలు పడుతున్నారు. ఆస్తులు దక్కించుకున్న కొడుకులు ఆ తర్వాత వారి పట్ల నిర్లక్ష్యం వహిస్తున్నారు. దీంతో నేటి సమాజంలో చాలా మంది తల్లిదండ్రులు మలి వయసులో అష్టకష్టాలు పడుతున్నారు. ఈనేపథ్యంలో అసోం ప్రభుత్వం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. పేరెంట్స్ పట్ల నిర్లక్ష్యం వహించే ప్రభుత్వ ఉద్యోగుల వేతనం నుంచి కొంత మొత్తం మినహాయించనుంది. దీన్ని తల్లిదండ్రుల సంరక్షణకు వినియోగించనుంది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో దీనికి సంబంధించిన బిల్లును ప్రవేశపెట్టనున్నట్లు అసోం ఆర్ధిక మంత్రి హిమంత బిశ్వ శర్మ తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com