తమిళనాడులో కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు ఎమ్మెల్యేల బలాబలాలు...

- February 08, 2017 , by Maagulf
తమిళనాడులో కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు ఎమ్మెల్యేల బలాబలాలు...

చెన్నై: తమిళనాడులో కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు ఎమ్మెల్యేల బలాబలాలు కీలకం కానుండటంతో అన్నాడీఎంకే పార్టీ శరవేగంగా పావులు కదుపుతోంది. శశికళ వర్గీయులుగా చెబుతున్న సుమారు 130 మంది అన్నాడీఎంకే ఎమ్మెల్యేలను పార్టీ ప్రధాన కార్యాలయం నుంచి బస్సుల్లో తరలించారు వీరందరినీ ఒక హోటల్‌లో ఉంచనున్నట్టు సమాచారం. గవర్నర్ విద్యాసాగర్‌రావు ఏ క్షణంలోనైనా ఎమ్మెల్యేల బలం నిరూపించుకోవాలని కోరే అవకాశముందని భావిస్తున్న అన్నాడీఎంకే వర్గాలు ముందు జాగ్రత్తగా ఎమ్మెల్యేలు జారి పోకుండా ఏర్పాట్లు చేసింది. పార్టీ ప్రధాన కార్యాలయం వద్దకు చేరుకున్న ఎమ్మెల్యేలను అట్నించి అటే బస్సుల్లో తరలించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com