శివరాత్రికి పేలనున్న లక్ష్మీ బాంబ్...

- February 09, 2017 , by Maagulf
శివరాత్రికి పేలనున్న లక్ష్మీ బాంబ్...

మంచు లక్ష్మీ ప్రధాన పాత్రలో కార్తికేయ గోపాల కృష్ణ తెరకెక్కించిన చిత్రం లక్ష్మీ బాంబ్. గునపాటి సురేష్ రెడ్డి సమర్పణలో ఉద్భవ్‌ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఈ చిత్రం రూపొందింది. మంచి కామెడి థ్రిల్లర్, కొత్త కాన్సెప్ట్ తో ఈ సినిమా తెరకెక్కగా ఇందులో మంచు లక్ష్మీ జడ్జ్ పాత్రలో కనిపించనుంది. అయితే ఇప్పటి వరకు మంచు లక్ష్మీ చేయని పవర్‌ఫుల్ రోల్‌లో ఆమెను దర్శకుడు ప్రెజెంట్ చేసినట్టు తెలుస్తోంది. ఇక ఈ చిత్రం కోసం మనోజ్ ఫైట్ మాస్టర్ గా మారిన సంగతి తెలిసిందే. 

మహిళల సమస్యలను ఇతివృత్తంగా చేసుకొని రూపొందిన లక్ష్మీ బాంబ్ చిత్రం ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసుకుంది. అయితే ఆర్ధిక ఇబ్బందుల వలన ఈ చిత్ర విడుదల కొన్నాళ్ళుగా పోస్ట్ పోన్ అవుతూ వస్తున్నది.
ఇప్పుడు ఆ సమస్యలన్నింటిని అధిగమించి మహా శివరాత్రి కానుకగా ఫిబ్రవరి 24న లక్ష్మీ బాంబ్ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్టు నిర్మాతలు తెలిపారు. ఈ చిత్రం మంచు లక్ష్మీ కెరియర్ కి చాలా ఉపయోగపడుతుందని టీం భావిస్తున్నది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com