శివరాత్రికి పేలనున్న లక్ష్మీ బాంబ్...
- February 09, 2017
మంచు లక్ష్మీ ప్రధాన పాత్రలో కార్తికేయ గోపాల కృష్ణ తెరకెక్కించిన చిత్రం లక్ష్మీ బాంబ్. గునపాటి సురేష్ రెడ్డి సమర్పణలో ఉద్భవ్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఈ చిత్రం రూపొందింది. మంచి కామెడి థ్రిల్లర్, కొత్త కాన్సెప్ట్ తో ఈ సినిమా తెరకెక్కగా ఇందులో మంచు లక్ష్మీ జడ్జ్ పాత్రలో కనిపించనుంది. అయితే ఇప్పటి వరకు మంచు లక్ష్మీ చేయని పవర్ఫుల్ రోల్లో ఆమెను దర్శకుడు ప్రెజెంట్ చేసినట్టు తెలుస్తోంది. ఇక ఈ చిత్రం కోసం మనోజ్ ఫైట్ మాస్టర్ గా మారిన సంగతి తెలిసిందే.
మహిళల సమస్యలను ఇతివృత్తంగా చేసుకొని రూపొందిన లక్ష్మీ బాంబ్ చిత్రం ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసుకుంది. అయితే ఆర్ధిక ఇబ్బందుల వలన ఈ చిత్ర విడుదల కొన్నాళ్ళుగా పోస్ట్ పోన్ అవుతూ వస్తున్నది.
ఇప్పుడు ఆ సమస్యలన్నింటిని అధిగమించి మహా శివరాత్రి కానుకగా ఫిబ్రవరి 24న లక్ష్మీ బాంబ్ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్టు నిర్మాతలు తెలిపారు. ఈ చిత్రం మంచు లక్ష్మీ కెరియర్ కి చాలా ఉపయోగపడుతుందని టీం భావిస్తున్నది.
తాజా వార్తలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్కు అంతర్జాతీయ గుర్తింపు..!!







