షిర్డీ సాయిబాబాకు రూ.28లక్షల బంగారు కిరీటం బహుకరించిన ఇటలీ మహిళ..

- February 10, 2017 , by Maagulf
షిర్డీ సాయిబాబాకు  రూ.28లక్షల బంగారు కిరీటం బహుకరించిన ఇటలీ మహిళ..

షిర్డీ సాయిబాబాకు ఇటలీ దేశానికి చెందిన ఓ మహిళ రూ.28లక్షల బంగారు కిరీటాన్ని బహుకరించారు. శీలిని డోలోరాస్ అలియాస్ సాయి దుర్గా అనే 72 ఏళ్ల ఇటాలియన్ మహిళా భక్తురాలు 855 గ్రాముల బరువు ఉన్న రత్నాలు పొదిగిన బంగారు కిరీటాన్ని సాయిబాబా సంస్థాన్ ట్రస్టుకు బహుకరించారు. సాయిబాబా భక్తురాలైన ఇటలీ మహిళ గత 9 ఏళ్లుగా ప్రతీనెలా షిర్డీని సందర్శిస్తుంటారు. గతంలో ఈమె బంగారంతో తయారు చేసిన రుద్రాక్ష మాలను రూ.25లక్షలతో చేయించి ఇచ్చారు. తమ ఇటలీ దేశంలో సాయిబాబా దేవాలయాన్ని నిర్మిస్తున్నట్లు శీలిని డోలోరాస్ వెల్లడించారు. తమ దేశంలో నిర్మిస్తున్న దేవాలయంలో ప్రతిష్ఠించేందుకు సిద్ధం చేసిన సాయి ప్రతిమను షిర్డీ సాయి సన్నిధిలో పెట్టి ఆయన ఆశీస్సులు తీసుకున్నానని ఇటలీలోని సాయి భక్తురాలు వివరించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com