మీన్ వరుతరాచ...
- February 13, 2017
కావలసిన పదార్థాలు: ఫిష్ - 500 గ్రా
గ్రైండింగ్ కోసం: పచ్చి కొబ్బరి - 1 కప్పు, ఉల్లిపాయలు - 2, వెల్లుల్లి - 1 టీస్పూను, కారం - 1 టే.స్పూను, ధనియాల పొడి - 1 టే.స్పూను, మిరియాల పొడి - 1 టీస్పూను, మెంతులు - 1 టీస్పూను, కరివేపాకు - 2 రెమ్మలు
గ్రేవీ కోసం: అల్లం తురుము - 1 టీస్పూను, వెల్లుల్లి- అర టీస్పూను, పచ్చిమిర్చి - 2, ఉల్లిపాయలు - 2, పసుపు - 1 టీస్పూను
కోకుం - 3 (ఎండిపోయి ఉంటే వేడి నీళ్లలో 10 నిమిషాలు నానబెట్టాలి), టమేటా - 1, కరివేపాకు - 1 రెమ్మ, కొబ్బరి నూనె - ఉప్పు.
తయారీ విధానం: బాండీ వేడిచేసి గ్రైండింగ్ కోసం చెప్పిన దినుసులన్నీ (కారం, ధనియాల పొడి, కరివేపాకు) వేయించుకోవాలి. కొబ్బరి రంగు మారాక, కారం, ధనియాల పొడి, కరివేపాకు వేసి 2 నిమిషాలు వేయించి చల్లారాక నీరు చేర్చి మెత్తగా రుబ్బుకోవాలి. అదే బాండీలో నూనె వేడిచేసి అర టే.స్పూను వెల్లుల్లి తరుగు, 1 టీస్పూను అల్లం తరుగు, 6 చిన్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి అవి రంగు మారుతున్నప్పుడు పసుపు వేసి కలపాలి. తర్వాత నూరి పెట్టుకున్న ముద్ద వేసి ఉప్పు, 2 కప్పుల నీరు చేర్చిఉడికించాలి. తర్వాత కోకుం వేసి 2 నిమిషాలు ఉడికించాలి. తర్వాత చేప ముక్కలు వేయాలి. మసాలా తగిలేలా ముక్కలన్నిటినీ కలిపి మూత ఉంచి ఉడికించాలి. చేపలు సగం ఉడికాక టమాటా ముక్కలు వేయాలి. పూర్తిగా ఉడికాక మంట తీసి 1 టే.స్పూను కొబ్బరి నూనె, కరివేపాకు వేసి కలిపి వడ్డించాలి.
తాజా వార్తలు
- జూలై 1 నుంచి 3 వరకు భారత్లో పర్యటించనున్న జపాన్ ప్రధాని
- మాదకద్రవ్యాల పై సమగ్ర యుద్ధం ప్రకటిద్దాం: తెలంగాణ పోలీస్
- ఒమాన్లో ఉరుములు, మెరుపులతో భారీ వర్షాల హెచ్చరిక..
- యూఏఈలో తప్పుడు ఎమర్జెన్సీ అలర్ట్లు..సాంకేతిక లోపమే కారణం: NCEMA
- దుబాయ్ ఆవిష్కరణల స్ఫూర్తికి ప్రతీక 'దుబాయ్-ఇట్' కార్యక్రమం
- ఏడాది చివరినాటికి అబుదాబిలో ఎయిర్ టాక్సీ సేవలు..
- ఇరాన్ విదేశాంగ మంత్రితో యూఏఈ విదేశాంగ మంత్రి అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్ సంభాషణ
- RTGS సేవల పై మంత్రి నారా లోకేశ్ ఉన్నతస్థాయి సమీక్ష
- నాగ్పూర్ విమానాశ్రయం జీఎంఆర్ ఎయిర్పోర్ట్స్ పోర్ట్ఫోలియోలో చేరిక
- సీఎం రేవంత్ ప్రభుత్వం కీలక నిర్ణయం..







