మాదకద్రవ్యాల పై సమగ్ర యుద్ధం ప్రకటిద్దాం: తెలంగాణ పోలీస్
- June 26, 2026
హైదరాబాద్: అంతర్జాతీయ మాదకద్రవ్యాల దుర్వినియోగం మరియు అక్రమ రవాణా నిరోధక దినోత్సవం సందర్భంగా జూన్ 26న ఈగిల్ ఫోర్స్ (EAGLE Force), మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ సంయుక్తంగా నిర్వహించిన కార్యక్రమంలో తెలంగాణ పోలీసు డిజిపి సి.వి.ఆనంద్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేశానికే కాకుండా ప్రపంచానికే ముప్పుగా మారిన మాదకద్రవ్యాల మహమ్మారిపై అందరం కలిసికట్టుగా సమగ్ర యుద్ధం ప్రకటించాలని పిలుపునిచ్చారు. సమాజం అత్యంత కీలకమైన దశలో ఉందని, మాదకద్రవ్యాల తయారీదారులు, అక్రమ రవాణాదారులు ఉగ్రవాదుల కంటే ప్రమాదకరమైన వారని ఆయన పేర్కొన్నారు.
నిరపరాధ చిన్నారులను వివిధ మార్గాల ద్వారా మాదకద్రవ్యాల బారిన పడేలా లక్ష్యంగా చేసుకోవడం అత్యంత హేయమైన చర్య అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. యువతను, ముఖ్యంగా పిల్లలను ఈ వ్యసనాల నుంచి కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు.
మాదకద్రవ్యాల నిర్మూలన కోసం తెలంగాణ పోలీసులు తమ శక్తివంచన లేకుండా పోరాటం కొనసాగిస్తారని, ఈ అక్రమ వ్యాపారంలో పాల్గొనే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండి మాదకద్రవ్యాలకు సంబంధించిన సమాచారాన్ని వెంటనే పోలీసులకు అందించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో అధికారులు, మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ ప్రతినిధులు, విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థల సభ్యులు పాల్గొని మాదకద్రవ్యాల నిర్మూలన పై అవగాహన కల్పించారు.
తాజా వార్తలు
- జూలై 1 నుంచి 3 వరకు భారత్లో పర్యటించనున్న జపాన్ ప్రధాని
- మాదకద్రవ్యాల పై సమగ్ర యుద్ధం ప్రకటిద్దాం: తెలంగాణ పోలీస్
- ఒమాన్లో ఉరుములు, మెరుపులతో భారీ వర్షాల హెచ్చరిక..
- యూఏఈలో తప్పుడు ఎమర్జెన్సీ అలర్ట్లు..సాంకేతిక లోపమే కారణం: NCEMA
- దుబాయ్ ఆవిష్కరణల స్ఫూర్తికి ప్రతీక 'దుబాయ్-ఇట్' కార్యక్రమం
- ఏడాది చివరినాటికి అబుదాబిలో ఎయిర్ టాక్సీ సేవలు..
- ఇరాన్ విదేశాంగ మంత్రితో యూఏఈ విదేశాంగ మంత్రి అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్ సంభాషణ
- RTGS సేవల పై మంత్రి నారా లోకేశ్ ఉన్నతస్థాయి సమీక్ష
- నాగ్పూర్ విమానాశ్రయం జీఎంఆర్ ఎయిర్పోర్ట్స్ పోర్ట్ఫోలియోలో చేరిక
- సీఎం రేవంత్ ప్రభుత్వం కీలక నిర్ణయం..







