జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు...

- February 13, 2017 , by Maagulf
జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు...

శ్రీనగర్‌: జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. బందిపొరా జిల్లాలోని హజిన్‌ ప్రాంతంలో మంగళవారం ఉదయం భద్రతా బలగాలపై కాల్పులకు పాల్పడ్డారు. ఈ ఘటనలో ఇద్దరు జవాన్లకు గాయాలైనట్లు సమాచారం.

ఇంటలిజెన్స్‌ వర్గాల సమాచారం మేరకు పర్రే మొహల్లా ఏరియాలో ఉగ్రవాదులు ఉన్నారన్న సమాచారం మేరకు భద్రతా బలగాలు సెర్చ్ ఆపరేషన్‌ నిర్వహిస్తుండగా ఈ ఎదురుకాల్పులు చోటు చేసుకున్నట్లు ఓ పోలీసు అధికారి వెల్లడించారు. ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. దీనికి సంబంధించిన మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com