కీలక అంశాలపై కమ్యూనిటీ మెంబర్స్‌తో సిజి చర్చలు

- February 14, 2017 , by Maagulf
కీలక అంశాలపై కమ్యూనిటీ మెంబర్స్‌తో సిజి చర్చలు

జెడ్డా: ఇండియన్‌ కాన్సుల్‌ జనరల్‌ నూర్‌ రెహ్మాన్‌ షేక్‌, ఇండియన్‌ మ్యూనిటీ సభ్యులతో కాన్సులేట్‌లో ఆదివారం సమావేశమయ్యారు. గ్రివెన్సెస్‌కి సంబంధించి సూచనలు, సలహాలు తీసుకునేందుకుగాను ఈ మీటింగ్‌ ఏర్పాటు చేయబడింది. ఈ సందర్భంగా షేక్‌, ఇ-మైగ్రేట్‌ సిస్టమ్‌ గురించి కమ్యూనిటీ మెంబర్స్‌కి వివరించారు. కింగ్‌డమ్‌కి ఉపాధి కోసం వచ్చే వర్కర్స్‌, హౌస్‌మెయిడ్స్‌ రిజిస్ట్రేషన్‌ కోసం ఈ కొత్త సిస్టమ్‌ ఉపయోగకరంగా ఉంటుంది. పూర్తిస్థాయి పాదర్శకత కోసం దీన్ని ఏర్పాటు చేశారు. రిసెప్షన్‌ ఏరియాలో అదనంగా మరో సజెషన్స్‌ బాక్స్‌ని కూడా ఏర్పాటు చేశారు. కాన్సులేట్‌లో జాబ్‌ ఫెయిర్‌ని ఏర్పాటు చేయాలనే సూచన ఎప్పటినుంచో ఉన్నా, దానిపై ఇంకా చర్చ జరగాల్సి ఉంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com