జెడ్డాలో 12 లైసెన్సు లేని వాటర్ బాట్లింగ్ ప్లాంట్లు సీజ్..!!
- June 25, 2026
రియాద్: జెడ్డాలో 12 లైసెన్సు లేని నీటి బాట్లింగ్ ప్లాంట్లను వాణిజ్య మంత్రిత్వ శాఖ మూసివేసింది. ఉల్లంఘనలకు పాల్పడిన వారిని అరెస్టు చేశారు. ఎనిమిది ప్రభుత్వ ఏజెన్సీల సమన్వయంతో, తనిఖీ బృందాలు ఈ ప్లాంట్లలో ప్రజారోగ్యానికి తీవ్రమైన ప్రమాదాలను కలిగించే తీవ్రమైన ఉల్లంఘనలను గుర్తించాయి. పబ్లిక్ వాటర్ నెట్వర్క్ నుండి అనధికారికంగా నీటిని తీసుకోవడం, లైసెన్సు పొందిన సంస్థలకు చెందిన కంటైనర్లలోకి నీటిని చట్టవిరుద్ధంగా బాట్లింగ్ చేయడం వంటి ఉల్లంఘనలను నమోదు చేశారు.
ఆపరేటర్లు తమ కార్యకలాపాలకు ముసుగుగా బాటిల్ నీటి అమ్మకాలు మరియు రిటైల్ లైసెన్సులను వాడుకుంటున్నారని విచారణలో గుర్తించారు. అలాగే, ఆరోగ్య నిబంధనలు మరియు అవసరాలకు అనుగుణంగా లేని ఉత్పత్తులను మార్కెట్లకు తరలించి లాభాలను పొందుతున్నట్లు నిందితులపై కేసులు నమోదుచేశారు.అదే విధంగా వాణిజ్యపరమైన గోప్యత, లైసెన్సు లేకుండా కార్యకలాపాలు నిర్వహించడం, ట్యాక్స్ ఇన్వాయిస్లు జారీ చేయకపోవడం, కార్మిక నిబంధనలను పాటించకపోవడం మరియు నీటి నెట్వర్క్ అవసరాలను ఉల్లంఘించడం వంటి అనేక నేరాలు మరియు ఉల్లంఘనలు నమోదు చేసినట్టు వాణిజ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.
తాజా వార్తలు
- జెన్జీ ఎఫెక్ట్తో కొత్త పార్టీ.. నేతాజీ వారసుడి సంచలన ప్రకటన
- సీఎం రేవంత్రెడ్డి విదేశీ పర్యటన షెడ్యూల్ ఖరారు
- కువైట్లో ఆగస్టు 27న ప్రభుత్వ సెలవు..!!
- ఎండలో కార్మికుడు కుప్పకూలితే ఏం చేయాలి? బహ్రెయిన్లో ప్రత్యేక శిక్షణ..!!
- ఒమన్లో త్వరలో ‘కన్స్యూమర్ పాస్పోర్ట్’ సర్వీస్..!!
- 183కి పైగా దేశాల్లో యూఏఈ ‘జైవాన్’ కార్డుల వినియోగం..!!
- డీప్ఫేక్లపై ఖతార్ హోంశాఖ హెచ్చరిక..!!
- రెస్టారెంట్లలో ఉల్లంఘనలపై కెమెరాలతో నిఘా..!!
- న్యాయ వ్యవస్థలో వేగం కోసం అన్ని విభాగాల సమన్వయం అవసరం: డీజీపీ సీవీ ఆనంద్
- డిసెంబర్లో ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్..!







