ప్రయోగం విజయవంతమవడంపై ప్రధాని నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం...
- February 15, 2017దిల్లీ: పీఎస్ఎల్వీ-సీ37 ప్రయోగం విజయవంతమవడంపై ప్రధాని నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. ఒకేసారి 104 ఉపగ్రహాలను నింగిలోకి పంపి ప్రపంచ రికార్డు సృష్టించిన ఇస్రో శాస్త్రవేత్తలపై ఆయన ప్రశంసలు కురిపించారు. పీఎస్ఎల్వీ-సీ37 ద్వారా కార్టోశాట్-2తో పాటు మరో 103 ఉపగ్రహాలు కక్ష్యలో చేరడంతో మోదీ ట్విట్టర్ ద్వారా ఇస్రోకు అభినందనలు తెలిపారు. ఈ ప్రయోగం దేశానికి, మన అంతరిక్ష పరిశోధన రంగానికి గర్వకారణమని కొనియాడారు. మన శాస్త్రవేత్తలకు దేశం సెల్యూట్ చేస్తోందని మోదీ ట్వీట్ చేశారు.
తాజా వార్తలు
- ఇళ్లకు ఉచితంగా మరమ్మతులు..ముందుకొచ్చిన డెవలపర్లు
- దుబా పోర్ట్లో భారీ డ్రగ్ స్మగ్లింగ్ గుట్టురట్టు
- మిడిల్ ఈస్ట్ వివాదం నివారణకు ఖతార్ పిలుపు
- షార్జాలో అదృశ్యమైన యువకుడు క్షేమం
- అబ్దల్లి కారు ప్రమాదంలో భారతీయ వ్యక్తి మృతి
- ఐక్యరాజ్యసమితి నిర్ణయంపై సర్వత్రా విచారం
- కాషాయ రంగులో దూరదర్శన్ లోగో.. ప్రతిపక్షాల విమర్శలు
- కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్
- 2025 Film Awards : అధికారిక తేదీని వెల్లడించిన BAFTA
- బుల్లెట్ ప్రూఫ్ కారులో కనిపించిన సల్మాన్ ఖాన్