ప్రయోగం విజయవంతమవడంపై ప్రధాని నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం...
- February 15, 2017దిల్లీ: పీఎస్ఎల్వీ-సీ37 ప్రయోగం విజయవంతమవడంపై ప్రధాని నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. ఒకేసారి 104 ఉపగ్రహాలను నింగిలోకి పంపి ప్రపంచ రికార్డు సృష్టించిన ఇస్రో శాస్త్రవేత్తలపై ఆయన ప్రశంసలు కురిపించారు. పీఎస్ఎల్వీ-సీ37 ద్వారా కార్టోశాట్-2తో పాటు మరో 103 ఉపగ్రహాలు కక్ష్యలో చేరడంతో మోదీ ట్విట్టర్ ద్వారా ఇస్రోకు అభినందనలు తెలిపారు. ఈ ప్రయోగం దేశానికి, మన అంతరిక్ష పరిశోధన రంగానికి గర్వకారణమని కొనియాడారు. మన శాస్త్రవేత్తలకు దేశం సెల్యూట్ చేస్తోందని మోదీ ట్వీట్ చేశారు.
తాజా వార్తలు
- ఇజ్రాయెల్, ఇరాన్ వెళ్లే భారతీయులకు విదేశాంగ సూచన
- టోఫెల్ ఇండియా ఛాంపియన్షిప్ను ప్రారంభించిన ఈటిఎస్
- వాట్సప్ లో కొత్త ఫీచర్..
- 7న ప్రత్యక్షంగా కోర్టులో ఎమ్మెల్సీ కవిత ని హాజరుపరచండి
- శంషాబాద్ సమీపంలో 34 కేజీల బంగారం స్వాధీనం
- ఆడబిడ్డకు జన్మనిచ్చిన దుబాయ్ రాయల్ షేఖా మహరా
- 17 ఏళ్ల బాలుడు మిస్సింగ్ కేసు విషాదాంతం
- 123 మంది కార్మికుల పై బహిష్కరణ వేటు
- భారత ప్రవాసుల కోసం 'ఓపెన్ హౌస్'
- స్విఫ్ట్ స్టూడెంట్ ఛాలెంజ్.. 'మై చైల్డ్' యాప్ కు ప్రశంసలు