పాక్ లో నిషేధం ఎత్తివేత భారత్ టీవీ ప్రసారలపై...

- February 15, 2017 , by Maagulf
పాక్ లో నిషేధం ఎత్తివేత భారత్ టీవీ ప్రసారలపై...

భారత్ సర్జికల్ స్ట్రైక్ అనంతరం భారత్ పాక్ ల మద్య ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ఈ నేపద్యంలో పాక్ ఎలక్రానిక్ మీడియా రెగ్యులేటరీ అథారిటీ 5 నెలల క్రితం ప్రైవేట్ కేబుల్ ద్వారా ప్రసారం అయ్యే భారత్ కార్యక్రమాలపై నిషేధం విధించింది. కాగా సినిమా థియేటర్స్ యజమాన్యం విపరీతమైన నష్టాల్లో కూరుకుపోవడంతో ఇటీవలే భారత్ సినిమాలపై ఉన్న ఆంక్షలను పాక్ ఎత్తివేశింది.. తాజాగా భారత్ టీవీ కార్యక్రమాలపై కూడా విధించిన నిషేధాన్ని పాక్ కోర్టు ఎత్తివేసింది. కాగా ఈ నేషధం పై లియో కమ్యూనికేషన్స్ అనే సంస్థ లాహోర్ హైకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్ పై మంగళవారం విచారణ జరిపిన లాహోర్ హై కోర్టు కేబుల్ ద్వారా ప్రసారమయ్యే భారతీయ కార్యక్రమాలపై నిషేధం ఎత్తివేస్తూ తీర్పు నిచ్చింది.. అంతేకాదు.. భారత్ సినిమాలపై లేని నిషేధం కేబుల్ టీవీలకు మాత్రం ఎందుకు అని ప్రశ్నించింది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com