ముఖ్యమంత్రి కేసీఆర్ 21న తిరుమలకు...
- February 15, 2017
వేంకటేశ్వరునికి తెలంగాణ మొక్కులను తీర్చేందుకు సీఎం కె.చంద్రశేఖర్రావు ఈ నెల 21న తిరుమలకు బయల్దేరనున్నారు. కుటుంబీకులు, కొందరు మంత్రులతో కలసి ప్రత్యేక విమానంలో మంగళవారం సాయంత్రం సీఎం తిరుపతి పర్యటనకు బయల్దేరుతారు. ఇప్పటికే ఖరారైన షెడ్యూలు ప్రకారం మంగళ వారం సాయంత్రం సీఎం తిరుపతి చేరుకుంటారు. కొండపైకి చేరుకొని రాత్రి తిరుమలలో బస చేస్తారు. 22న ఉదయాన్నే తిరుమలేశున్ని దర్శించుకుంటారు.
తెలంగాణ ప్రభుత్వం తరఫున దాదాపు రూ.5 కోట్ల విలువైన బంగారు ఆభరణాలను శ్రీవారికి సీఎం సమర్పిస్తారు.
తెలంగాణ ఉద్యమ సందర్భంగా మొక్కిన మొక్కులను తీర్చాలని రాష్ట్ర ప్రభుత్వం రెండేళ్ల కిందటే నిర్ణయం తీసుకోవడం, వేంకటేశ్వర స్వామికి రూ.5 కోట్ల విలువైన ఆభరణాలను తయారు చేయించడం తెలిసిందే. రూ.3.7 కోట్ల విలువైన 14.2 కిలోల సాలగ్రామ హారం, రూ.1.21 కోట్ల విలువైన 4.65 కిలోల కంఠాభరణాన్ని చేయించింది. వీటి తయారీ బాధ్యతను ఏడాది క్రితమే టీటీడీకి అప్పగించింది. కోయంబత్తూరుకు చెందిన కీర్తిలాల్ జ్యువెలరీస్ వీటిని తయారు చేసింది.
వీటిని ప్రస్తుతం టీటీడీ ఖజానాలో భద్రపరిచారు. మొత్తం 18.85 కిలోల బరువున్న ఈ కానుకలను శ్రీవారికి సీఎం ముట్టజెప్పనున్నారు. అనంతరం తిరుపతి చేరుకొని అలివేలు మంగాపురంలో అమ్మవారిని దర్శించుకుని, బంగారు ముక్కుపుడక సమర్పించుకుంటారు. అనంతరం సీఎం హైదరాబాద్కు తిరుగు పయనమవుతారు. 2010లో తెలంగాణ ఉద్యమం జోరుగా సాగుతున్న సమయంలో టీఆర్ఎస్ అధినేత హోదాలో కేసీఆర్ తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్నారు. రాష్ట్ర సాధన కల సాకారమైతే బంగారు కాసుల పేరు చేయిస్తానని మొక్కుకున్నారు.
తాజా వార్తలు
- గచ్చిబౌలిలో భారీ అగ్నిప్రమాదం: 15 బైకులు దగ్ధం
- ఒమన్ గల్ఫ్లో ముదిరిన ఉద్రిక్తతలు
- మలేషియాలో ఘోర అగ్నిప్రమాదం..వెయ్యి ఇళ్లు దగ్ధం
- అమెరికాలో మాస్ షూటింగ్…8 చిన్నారులు మృతి
- ఘర్రాఫత్ అల్ రాయన్ ఇంటర్చేంజ్ వద్ద రోడ్ మూసివేత..!!
- సౌదీ అరేబియాలో ఉరుములతో కూడిన వర్షాలు..!!
- యూఏఈలో నిత్యావసర వస్తువుల ధరలను పోల్చడానికి కొత్త వేదిక..!!
- ఒమన్ మానవ హక్కుల కమిషన్ (OHRC) పునర్నిర్మాణం..!!
- జాతీయ భద్రతా ఉల్లంఘనలపై తక్షణ చర్యలకు ఆదేశాలు..!!
- ఎయిర్ పోర్ట్ సంసిద్ధతను పరిశీలించిన కువైట్ పీఎం..!!









