మాదాపూర్లో సునీత దారుణహత్య
- February 15, 2017
నగరంలోని మాదాపూర్ ఠాణా పరిధిలో ఓ యువతి దారుణహత్యకు గురైంది. భాగ్యనగర్ కో-ఆపరేటివ్ సొసైటీ సమీపంలో ఎన్ఐఏ భవనం పక్కన బుధవారం కాలిపోయిన స్థితిలో మృతదేహం పడి ఉంది. దీన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి ఆధారాలు సేకరించారు. మృతురాలిని సికింద్రాబాద్కు చెందిన సునీతగా గుర్తించారు. ఆమె అమీర్పేటలోని ఓ ప్రైవేటు సంస్థలో టెలీకాలర్గా పనిచేస్తున్నట్లు తెలుసుకున్నారు. బుధవారం ఉదయం ఆఫీసుకు వెళ్లిన సునీత సాయంత్రం తిరిగి ఇంటికి రాలేదని కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సునీతను తెలిసిన వారే హత్య చేసి ఇక్కడ పడేశారా?
అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







