వలసలపై వచ్చేవారం ట్రంప్ మరో ఉత్తర్వు...
- February 16, 2017
వాషింగ్టన్: అమెరికాలో వలసదారులకు సంబంధించి వచ్చే వారంలోగా మరో కార్యనిర్వహక ఉత్తర్వులను జారీ చేయనున్నట్లు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. వలసదారులు, శరణార్థులకు సంబంధించి కొత్తగా ఉత్తర్వులు జారీ చేసేంతవరకు గతంలో ఇచ్చిన ‘ప్రయాణ నిషేధ’ ఉత్తర్వులను కొనసాగించాలని అమెరికా న్యాయ విభాగం న్యాయవాదులు ఫెడరల్ అప్పీల్స్ కోర్టును కోరారు. ఏడు ముస్లిం దేశాల పౌరులపై ట్రంప్ ఇటీవల జారీచేసిన ‘ప్రయాణ నిషేధ’ ఉత్తర్వులను కోర్టు నిలిపేయడంతో ఆయా దేశాల నుంచి అమెరికాకు ప్రయాణాలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో ట్రంప్ ప్రభుత్వం కొత్తగా మళ్లీ కార్యనిర్వహక ఉత్తర్వులు జారీ చేసేందుకు సిద్ధమైంది.
అమెరికాను రక్షించుకోవడానికి కొత్త ఆదేశాలు జారీ చేస్తానని గురువారం అధ్యక్షుడు ట్రంప్ వైట్హౌస్లో జరిగిన మీడియా సమావేశంలో వెల్లడించారు. ఈ ఉత్తర్వులతో అమెరికాలోకి ప్రవేశించే వారిని అత్యంత క్షుణ్ణంగా పరిశీలించే విధంగా చర్యలు తీసుకోబోతున్నట్లు సూచనప్రాయంగా చెప్పారు. గతంలో ఇచ్చిన వివాదాస్పద ఉత్తర్వుల్లో మార్పులు చేసి, చట్ట వ్యతిరేకమైన నిబంధనలను తొలగించి కొత్తగా ఉత్తర్వులు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







