ఒకేరోజు 24 మంది ఉగ్రవాదులు హతం..

- February 17, 2017 , by Maagulf
ఒకేరోజు 24 మంది ఉగ్రవాదులు హతం..

ఇస్లామాబాద్: ఓ ప్రార్థనాలయంలో ఉగ్రవాది చొరబడి ఆత్మాహుతితో 76 మందిని బలితీసుకున్న తెల్లారే.. పాకిస్తాన్ భద్రతా దళాలు శుక్రవారం దేశవ్యాప్తంగా సోదాలు నిర్వహించాయి. మొత్తం 24 మంది మిలిటెంట్లను కాల్చి చంపాయి. ఒక్క దక్షణ ప్రావిన్సులోనే 18 మంది ఉగ్రవాదులను మట్టుబెట్టినట్టు పారామిలటరీ సింద్ రేంజర్స్ శుక్రవారం వెల్లడించింది. సింధ్‌లోని సూపర్ హైవే వద్ద సైనిక కాన్వాయ్‌పై కాల్పులకు తెగబడిన మరో ఏడుగురు ఉగ్రవాదులు కూడా హతమైనట్టు రేంజర్స్ పేర్కొంది. కరాచీలో మంఘోపిర్ వద్ద జరిపిన సోదాల్లో 11 మంది ఉగ్రవాదులను కాల్చి చంపినట్టు తెలిపింది. మరోవైపు ఖైబర్-పక్తున్ఖవాలో పోలీసులు ప్రత్యేకంగా జరిపిన ఆపరేషన్‌లో మరో 11 మంది తీవ్రవాదులు హతమయ్యారు.
రెగ్గీ ప్రాంతంలో ముగ్గురు, పెషావర్‌లో నలుగురు, బన్ను ప్రాంతంలో మరో నలుగురు టెర్రరిస్టులు హతమయ్యారని ఓ సీనియర్ భద్రతాధికారి వెల్లడించారు. తీవ్రవాదాన్ని రూపుమాపేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పనిచేస్తోందనీ... ముందు ముందు మరిన్ని విస్తృత దాడులు చేస్తామని ప్రకటించారు. కేవలం వారం రోజుల్లోపు ఎనిమిది సార్లకు పైగా ఉగ్రవాదులు దాడులకు పాల్పడడంతో పాకిస్తాన్ ప్రభుత్వం సోదాలకు ఆదేశించినట్టు చెబుతున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com