పైత్యం ప్రకోపించిన పాకిస్థాన్ కార్మికుడు 8 ఏళ్ల బాలిక పెదవులను ముద్దాడేడు !!
- February 17, 2017
దుబాయ్ : మనసులోని వికారాలను కొందరు తమ చేష్టల ద్వారా బహిర్గతం చేస్తారు. అటువంటి పైత్యం ప్రకోపించిన ఓ పాకిస్తాన్ యువకుడు ప్రస్తుతం కోర్టు అభియోగాలలో చిక్కుకున్నాడు. తన గదిలో ఒంటరిగా కూర్చొని ఆటలు ఆడుకొంటున్న 8 ఏళ్ల బాలికని లక్ష్యంగా చేసుకొన్నాడు. సమీపంలో ఎవరూ లేరని నిర్ధారించుకున్న తర్వాత ఆ చిన్నారి పెదవులను చుంబించాడు ఇంటి సామానులు తరలించే సంస్థలో కార్మికునిగా పనిచేస్తున్న ఆ వ్యక్తి ఒక గదిలో ఒంటరిగా కూర్చొని అమాయకంగా ఆటలాడుకొంటున్న ఒక 8 ఏళ్ల అమ్మాయిని లైంగికంగా వేధించాడని ఇటీవల ఒక అభియోగం అతనిపై నమోదైంది. దీనిపై గురువారం నాడు విచారణ జరిగింది. కోర్ట్ ఆఫ్ ఫస్ట్ ఇన్స్టాన్స్ తెలిపిన సమాచారం మేరకు నిందితుడు బాలిక ఒంటరిగా ఒక బెడ్ రూమ్ లో ఆటలాడుకొంటున్న సమయంలో సామాను సర్ది అక్కడ్నించి తరలించే పని చేయాల్సిందిపోయి 23 ఏళ్ల పాకిస్తానీ ముద్దాయి అభం శుభం తెలియని ఆ చిట్టి తల్లి పట్ల అనుచితంగా ప్రవర్తించేందుకు ఆ సమయాన్ని మలుచుకొన్నాడు. దీనితో భయపడిన ఆ బాలిక అక్కడ్నించి పరుగెత్తుకు వెళ్లి తల్లి వద్దకు చేరుకోందని నేరారోపణ చేసింది. దీనితో పాకిస్థాన్ ముద్దాయి తరుపున వాదించే రక్షణ న్యాయవాది తదుపరి విచారణ వరకు కేసు ఫైల్ యొక్క నకలును ఇవ్వాలని అభ్యర్థించిన నేపథ్యంలో ఆ కాపీని ఆయనకు అందించారు. కాగా నిందితుడు తాను ఆ బాలిక పట్ల చేసిన తప్పునకు ఏ మాత్రం పశ్చాత్తాపపడకపోవడం గమనార్హం.దీనితో ఆ కార్మికుడిని తదుపరి విచారణ వరకు నిర్బంధంలో ఉంచబడ్డాడు. 36 ఏళ్ల ఆ బాలిక తల్లి ఒక ఆస్ట్రియన్ ఉపాధ్యాయురాలిగా పనిచేస్తుంది.ఆమె ఇంట్లో ఫర్నిచర్ తరలించడానికి వచ్చిన సంస్థ సిబ్బందికి తరలింపు పని అప్పగించడంతో ఆమె ఆ పనులలో నిమగ్నమై ఉండగా ఆ సంఘటన జరిగినట్లు ఆమె తెలిపింది. ఈ కేసు మార్చి13 వ తేదికి వాయిదా వేయబడింది. గత ఏడాది డిసెంబర్ 17 వ తేదీన ఆల్ బార్ష పోలీసు స్టేషన్ కు ఫిర్యాదు నమోదు చేయబడింది.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







