ముంగోడీ కర్రీ..
- February 17, 2017
కావలసిన పదార్థాలు
కందిపప్పు- ఒక కప్పు, మినప్పప్పు- అర కప్పు, ఇంగువ- చిటికెడు, తరిగిన ఉల్లిపాయ, టమోట- ఒక్కోటి చొప్పున, పచ్చిమిర్చి- 3, అల్లం తురుము- ఒక టీస్పూను, జీలకర్ర- అర టీ స్పూను, ధనియాల పొడి- ఒక టీస్పూను, పసుపు- పావు టీ స్పూను, కారం- ఒక టేబుల్ స్పూను, ఉప్పు- తగినంత, నూనె- వేగించడానికి సరిపడా.
తయారీ విధానం
కందిపప్పు, మినప్పప్పులను ముందు రోజు రాత్రి కడిగి నానబెట్టుకో వాలి. తర్వాత ఇంగువ వేసి మెత్తగా రుబ్బుకోవాలి. కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు, అర టీస్పూను అల్లం తురుము వేసి పుణుగుల్లా నూనెలో వేగించుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక బాణలిలో 2 టీస్పూన్ల నూనె పోసి జీలకర్ర, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, మిగిలిన అల్లం తురుము వేసి వేగించాలి. తర్వాత టమోటా, కారం, ధనియాల పొడి, పసుపు, ఉప్పు వేసి 2 నిమిషాలు వేగించి 2 గ్లాసుల నీళ్లు పోసి 5 నిమిషాలు ఉడికించాలి. చివర్లో పుణుగులను వేసి మరో 2 నిమిషాలు ఉడికించి దించేయాలి.
తాజా వార్తలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!







