హెలికాప్టర్ కెమెరాలు సైబరాబాద్లో...
- February 17, 2017
కొనుగోలుకు పోలీసుల కసరత్తు
పలు కంపెనీల ప్రతినిధులతో సంప్రదింపులు సైబరాబాద్ పోలీసుల అమ్ముల పొదిలో హెలికాప్టర్ కెమెరాలు చేరబోతున్నాయి. సైబర్ సిటీ భద్రత దృష్ట్యా ఈ కెమెరాలను కొనుగోలు చేయబోతున్నట్టు సమాచారం. హెలికాప్టర్ కెమెరాల ద్వారా ఐటీ కారిడార్పై డేగకన్ను వేయాలని ఉన్నతాధికారులు నిర్ణయించారు. హెలికాప్టర్ కెమెరాలకు చెందిన పలు కంపెనీల ప్రతినిధులతో గచ్చిబౌలి కమిషనరేట్లో శుక్రవారం సంప్ర దింపులు జరిపారు. వాటి పనితీరు, కమాండ్ కంట్రోల్ రూంకు అనుసంధానం తదితర విషయాలు చర్చకు వచ్చినట్టు విశ్వస నీయంగా తెలిసింది.
కంపెనీల ప్రతినిధులు వాటి పనితీరుపై డెమో కూడా ఇచ్చారు. అత్యాధునిక కెమెరాల గురించి పోలీసులు ఆరా తీసినట్టు సమాచారం.
ధర 75 లక్షలు
అత్యాధునిక హెలికాప్టర్ కెమెరాల ధర భారీగా ఉన్నట్టు పోలీసులు వర్గాలు తెలిపాయి. ఒక్కోదానికి రూ. 75 లక్షల మేర ఖర్చవుతోందని కంపెనీల ప్రతినిధులు సమావేశంలో పేర్కొ న్నారు. బడ్జెట్ను బట్టి వాటిని త్వరలో కొనుగోలు చేసేందుకు నిర్ణయం తీసుకునే అవకాశాలున్నట్టు తెలిసింది. ట్రాఫిక్ రద్దీ, నేరగాళ్ల కదలికలను హెలికాప్టర్ కెమెరాల ద్వారా సులువుగా పసిగట్టవచ్చని ఓ పోలీస్ అధికారి తెలిపారు.
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







