హెలికాప్టర్ కెమెరాలు సైబరాబాద్లో...
- February 17, 2017
కొనుగోలుకు పోలీసుల కసరత్తు
పలు కంపెనీల ప్రతినిధులతో సంప్రదింపులు సైబరాబాద్ పోలీసుల అమ్ముల పొదిలో హెలికాప్టర్ కెమెరాలు చేరబోతున్నాయి. సైబర్ సిటీ భద్రత దృష్ట్యా ఈ కెమెరాలను కొనుగోలు చేయబోతున్నట్టు సమాచారం. హెలికాప్టర్ కెమెరాల ద్వారా ఐటీ కారిడార్పై డేగకన్ను వేయాలని ఉన్నతాధికారులు నిర్ణయించారు. హెలికాప్టర్ కెమెరాలకు చెందిన పలు కంపెనీల ప్రతినిధులతో గచ్చిబౌలి కమిషనరేట్లో శుక్రవారం సంప్ర దింపులు జరిపారు. వాటి పనితీరు, కమాండ్ కంట్రోల్ రూంకు అనుసంధానం తదితర విషయాలు చర్చకు వచ్చినట్టు విశ్వస నీయంగా తెలిసింది.
కంపెనీల ప్రతినిధులు వాటి పనితీరుపై డెమో కూడా ఇచ్చారు. అత్యాధునిక కెమెరాల గురించి పోలీసులు ఆరా తీసినట్టు సమాచారం.
ధర 75 లక్షలు
అత్యాధునిక హెలికాప్టర్ కెమెరాల ధర భారీగా ఉన్నట్టు పోలీసులు వర్గాలు తెలిపాయి. ఒక్కోదానికి రూ. 75 లక్షల మేర ఖర్చవుతోందని కంపెనీల ప్రతినిధులు సమావేశంలో పేర్కొ న్నారు. బడ్జెట్ను బట్టి వాటిని త్వరలో కొనుగోలు చేసేందుకు నిర్ణయం తీసుకునే అవకాశాలున్నట్టు తెలిసింది. ట్రాఫిక్ రద్దీ, నేరగాళ్ల కదలికలను హెలికాప్టర్ కెమెరాల ద్వారా సులువుగా పసిగట్టవచ్చని ఓ పోలీస్ అధికారి తెలిపారు.
తాజా వార్తలు
- ముబారక్ అల్-కబీర్ పోర్టు ఘటన..ఖండించిన కువైట్..!!
- అజర్బైజాన్లోని విమానాశ్రయం పై ఇరాన్ దాడి..!!
- మళ్లీ విమాన కార్యకలాపాలను నిలిపివేసిన బహ్రెయిన్..!!
- ఫైర్ వర్క్స్ పై పోలీసుల వార్న్..Dh100,000 ఫైన్, ఏడాది జైలు..!!
- డిగ్రీ అర్హతతో 216 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు..
- ఫిలిం,టెలివిజన్ హబ్ గా ఏపీ: మంత్రి దుర్గేష్
- అమెరికా చర్యకు పశ్చాత్తాపం తప్పదు: ఇరాన్ విదేశాంగ మంత్రి హెచ్చరిక
- అమెరికా నెక్స్ట్ టార్గెట్ ఈక్వెడార్..ప్రారంభమైన దాడులు
- సెమీస్ పరీక్షకు సిద్ధమైన భారత్..!
- ఖమేనీ అంత్యక్రియల వాయిదా









