హెలికాప్టర్ కెమెరాలు సైబరాబాద్లో...
- February 17, 2017
కొనుగోలుకు పోలీసుల కసరత్తు
పలు కంపెనీల ప్రతినిధులతో సంప్రదింపులు సైబరాబాద్ పోలీసుల అమ్ముల పొదిలో హెలికాప్టర్ కెమెరాలు చేరబోతున్నాయి. సైబర్ సిటీ భద్రత దృష్ట్యా ఈ కెమెరాలను కొనుగోలు చేయబోతున్నట్టు సమాచారం. హెలికాప్టర్ కెమెరాల ద్వారా ఐటీ కారిడార్పై డేగకన్ను వేయాలని ఉన్నతాధికారులు నిర్ణయించారు. హెలికాప్టర్ కెమెరాలకు చెందిన పలు కంపెనీల ప్రతినిధులతో గచ్చిబౌలి కమిషనరేట్లో శుక్రవారం సంప్ర దింపులు జరిపారు. వాటి పనితీరు, కమాండ్ కంట్రోల్ రూంకు అనుసంధానం తదితర విషయాలు చర్చకు వచ్చినట్టు విశ్వస నీయంగా తెలిసింది.
కంపెనీల ప్రతినిధులు వాటి పనితీరుపై డెమో కూడా ఇచ్చారు. అత్యాధునిక కెమెరాల గురించి పోలీసులు ఆరా తీసినట్టు సమాచారం.
ధర 75 లక్షలు
అత్యాధునిక హెలికాప్టర్ కెమెరాల ధర భారీగా ఉన్నట్టు పోలీసులు వర్గాలు తెలిపాయి. ఒక్కోదానికి రూ. 75 లక్షల మేర ఖర్చవుతోందని కంపెనీల ప్రతినిధులు సమావేశంలో పేర్కొ న్నారు. బడ్జెట్ను బట్టి వాటిని త్వరలో కొనుగోలు చేసేందుకు నిర్ణయం తీసుకునే అవకాశాలున్నట్టు తెలిసింది. ట్రాఫిక్ రద్దీ, నేరగాళ్ల కదలికలను హెలికాప్టర్ కెమెరాల ద్వారా సులువుగా పసిగట్టవచ్చని ఓ పోలీస్ అధికారి తెలిపారు.
తాజా వార్తలు
- గచ్చిబౌలిలో భారీ అగ్నిప్రమాదం: 15 బైకులు దగ్ధం
- ఒమన్ గల్ఫ్లో ముదిరిన ఉద్రిక్తతలు
- మలేషియాలో ఘోర అగ్నిప్రమాదం..వెయ్యి ఇళ్లు దగ్ధం
- అమెరికాలో మాస్ షూటింగ్…8 చిన్నారులు మృతి
- ఘర్రాఫత్ అల్ రాయన్ ఇంటర్చేంజ్ వద్ద రోడ్ మూసివేత..!!
- సౌదీ అరేబియాలో ఉరుములతో కూడిన వర్షాలు..!!
- యూఏఈలో నిత్యావసర వస్తువుల ధరలను పోల్చడానికి కొత్త వేదిక..!!
- ఒమన్ మానవ హక్కుల కమిషన్ (OHRC) పునర్నిర్మాణం..!!
- జాతీయ భద్రతా ఉల్లంఘనలపై తక్షణ చర్యలకు ఆదేశాలు..!!
- ఎయిర్ పోర్ట్ సంసిద్ధతను పరిశీలించిన కువైట్ పీఎం..!!









