ఉత్కంఠ నడుమ తమిళనాడు అసెంబ్లీ బలపరీక్షకు..
- February 17, 2017
ఉత్కంఠ నడుమ తమిళనాడు అసెంబ్లీ బలపరీక్షకు సిద్ధమైంది. ఇప్పటికే పళనిస్వామి, పన్నీర్ సెల్వం తమ తమ ఎమ్మెల్యేలతో అసెంబ్లీకి చేరుకున్నారు. పళని స్వామి వర్గం కొద్ది సేపటి కిందటే గోల్డెన్ బే రిసార్ట్ నుంచి అసెంబ్లీ చేరుకుంది. పళనిస్వామికి 122 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉండగా, పన్నీర్ సెల్వంకు 12 మంది ఎమ్మెల్యేలు మద్దతు తెలుపుతున్నారు. పళనిస్వామి వర్గానికి చెందిన అరుణ్ కుమార్ తాను ఓటింగ్లో పాల్గొనేది లేదని తేల్చి చెప్పేశారు.
ఇప్పటికే బలపరీక్షలో పళనిస్వామికి వ్యతిరేకంగా ఓటు వేయాలని డీఎంకే నిర్ణయించింది. అనారోగ్యం వల్ల ఆ పార్టీకి చెందిన కరుణానిధి అసెంబ్లీకి హాజరు కావడం లేదు. ఓటింగ్ను రహస్య బ్యాలెట్ విధానంలో చేపట్టాలని పన్నీర్ వర్గం డిమాండ్ చేస్తున్నా.. అది జరిగే అవకాశం కనిపించడంలేదు. అసెంబ్లీలో బలపరీక్ష కోసం సభా నాయకుడిగా సెంగొట్టయ్యన్ను నియమించారు. అసెంబ్లీలో 6 డివిజన్లు ఉండగా.. అసెంబ్లీ కార్యదర్శి డివిజన్ల వారీగా ఓట్లను లెక్కించనున్నారు. 6 డివిజన్ల ప్రక్రియ అనంతరం నిర్ణయం స్పీకర్ తన నిర్ణయాన్ని వెల్లడించనున్నారు. బలపరీక్ష నేపథ్యంలో చెన్నై అసెంబ్లీ వద్ద భారీ భద్రతను ఏర్పాటు చేశారు.
తాజా వార్తలు
- ఢిల్లీ క్యాపిటల్స్ చారిత్రాత్మక విజయం..
- TANA ప్రపంచసాహిత్యవేదిక 6వ వార్షికోత్సవం
- బిగ్ టికెట్ ఈ-డ్రాలో నలుగురు భారతీయులకు అదృష్టం..
- మలేషియాలో అక్రమ వలసదారులకు ఊరట..
- EC నిర్ణయాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టు కు మమతా బెనర్జీ
- RTC కార్మికులకు సీఎం రేవంత్ గుడ్ న్యూస్
- పసుపు క్వింటాల్ కు రూ.16 వేల మద్దతు ధర ప్రకటించాలి: కవిత
- వైజాగ్ ఫుడ్ లవర్స్ కి గుడ్ న్యూస్..
- పెట్రోల్, డీజిల్ ధరల పై బాంబు పేల్చిన కేంద్ర ప్రభుత్వం
- జాతీయ సమైక్యతకు ‘ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్’ కీలకం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా









