ఉత్కంఠ నడుమ తమిళనాడు అసెంబ్లీ బలపరీక్షకు..
- February 17, 2017
ఉత్కంఠ నడుమ తమిళనాడు అసెంబ్లీ బలపరీక్షకు సిద్ధమైంది. ఇప్పటికే పళనిస్వామి, పన్నీర్ సెల్వం తమ తమ ఎమ్మెల్యేలతో అసెంబ్లీకి చేరుకున్నారు. పళని స్వామి వర్గం కొద్ది సేపటి కిందటే గోల్డెన్ బే రిసార్ట్ నుంచి అసెంబ్లీ చేరుకుంది. పళనిస్వామికి 122 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉండగా, పన్నీర్ సెల్వంకు 12 మంది ఎమ్మెల్యేలు మద్దతు తెలుపుతున్నారు. పళనిస్వామి వర్గానికి చెందిన అరుణ్ కుమార్ తాను ఓటింగ్లో పాల్గొనేది లేదని తేల్చి చెప్పేశారు.
ఇప్పటికే బలపరీక్షలో పళనిస్వామికి వ్యతిరేకంగా ఓటు వేయాలని డీఎంకే నిర్ణయించింది. అనారోగ్యం వల్ల ఆ పార్టీకి చెందిన కరుణానిధి అసెంబ్లీకి హాజరు కావడం లేదు. ఓటింగ్ను రహస్య బ్యాలెట్ విధానంలో చేపట్టాలని పన్నీర్ వర్గం డిమాండ్ చేస్తున్నా.. అది జరిగే అవకాశం కనిపించడంలేదు. అసెంబ్లీలో బలపరీక్ష కోసం సభా నాయకుడిగా సెంగొట్టయ్యన్ను నియమించారు. అసెంబ్లీలో 6 డివిజన్లు ఉండగా.. అసెంబ్లీ కార్యదర్శి డివిజన్ల వారీగా ఓట్లను లెక్కించనున్నారు. 6 డివిజన్ల ప్రక్రియ అనంతరం నిర్ణయం స్పీకర్ తన నిర్ణయాన్ని వెల్లడించనున్నారు. బలపరీక్ష నేపథ్యంలో చెన్నై అసెంబ్లీ వద్ద భారీ భద్రతను ఏర్పాటు చేశారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







