దోహాలో తొలిసారిగా ఇండియన్ ప్రోడక్ట్స్ ఎగ్జిబిషన్
- February 18, 2017
దోహా:దోహా ఎగ్జిబిషన్ మరియు కన్వెన్షన్ సెంటర్లో మార్చ్ 16 నుంచి 22 వరకు తొలిసారిగా ఇండియన్ ప్రోడక్ట్స్ మరియు ఇండస్ట్రీస్ కోసం ఎగ్జిబిషన్ జరగనుంది. ఖతార్ ఛాంబర్ అండ్ స్క్వేర్ ఎగ్జిబిషన్ మేనేజ్మెంట్ ఈ ఎగ్జిబిషన్ని నిర్వహిస్తోంది. 6 వేల చదరపు మీటర్ల ప్రాంతంలో ఎగ్జిబిషన్ని ఏర్పాటు చేస్తున్నారు. టెక్స్టైల్స్, ఎలక్ట్రానిక్స్, ఫ్యాషన్, కాశ్మీరీ ప్రోడక్ట్స్, ఆర్ట్స్, క్రాఫ్ట్స్, రియల్ ఎస్టేట్, ఇంజనీరింగ్ టెక్నాలజీ తరఫున 190 ఇండియన్ కంపెనీల స్టాల్స్ ఈ ఎగ్జిబిషన్లో ప్రధాన ఆకర్షణ కానున్నాయి. ఖతార్ ఛాంబర్ డైరెక్టర్ జనరల్ సలె అల్ షర్కి మాట్లాడుతూ, ఈ తరహా ఎగ్జిబిషన్ తొలిసారిగా నిర్వహిస్తున్నామనీ, తొలి దఫాలోనే మంచి పేరు ఈ ఎగ్జిబిషన్కి వస్తుందని చెప్పారు. ఖతార్లో ఇండియన్ రాయబారి పి కుమరన్ మాట్లాడుతూ, భారతదేశానికి చెందిన పలు కంపెనీలు, ఉత్పత్తులు ఇక్కడివారిని విశేషంగా ఆకట్టుకోనున్నాయని అన్నారు. ఖతార్, ఇండియా మధ్య ట్రేడ్ వాల్యూమ్ 10 బిలియన్ డాలర్లుగా ఉందని ఆయన వివరించారు. ఇరు దేశాల మధ్యా ట్రేడ్ రిలేషన్స్ ఇంకా బలోపేతమవ్వాలని కుమరన్ ఆకాంక్షించారు.
తాజా వార్తలు
- పోలీసుల సంక్షేమమే ప్రథమ ప్రాధాన్యం: డీజీపీ సీవీ ఆనంద్
- తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా రెండు ఎయిర్పోర్ట్ లు..
- నిరసనకారుల రాళ్ల దాడిలో 118 మంది పోలీసులకు గాయాలు
- విదేశీ విద్యార్థులకు US కొత్త రూల్స్..!
- ఇరాన్ కొనసాగిస్తున్న దాడులు.. కువైట్పై క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- ఇరాన్ పై అమెరికా వరుసగా 10వ రాత్రి దాడులు..
- నిరాహార దీక్ష ఆపేది లేదు–సోనమ్ వాంగుక్ ప్రకటన
- ఇరాన్ దాడుల ప్రభావం.. బహ్రెయిన్, కువైట్, ఖతార్ విమానాలకు అంతరాయం
- ఏపీ విద్యార్థులకు సర్కార్ గుడ్ న్యూస్..
- డీజీపీ సీవీ ఆనంద్ ని కలిసిన క్రికెటర్ మహమ్మద్ సిరాజ్







