ఉగ్రవాదాన్ని ప్రతిఘటించాల్సిందే: డొనాల్డ్ ట్రంప్
- February 18, 2017
ఉగ్రవాదాన్ని ప్రతిఘటించాల్సిందేనని, ఉగ్రవాదులను ఓడించాల్సిందేనని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పునరుద్ఘాటించారు. ఈ లక్ష్యాలను తమ ప్రభుత్వం సాధించగలదన్న నమ్మకం తనకుందని ఆయన స్పష్టం చేశారు. 'ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా అందరికీ ముప్పే. కనుక దీనిని ప్రతిఘటించి ఉగ్రవాదులను ఓడించి తీరాలి' అని శుక్రవారం ఆయన అమెరికా ప్రజలను ఉద్దేశించి చేసిన వారాంతపు రేడియో ప్రసంగంలో పేర్కొన్నారు. గత వారం ఇజ్రాయిల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహుతో భేటీ అయ్యానని, ఇజ్రాయిల్ భద్రతకు అమెరికా కట్టుబడి ఉందని ఈ సందర్భంగా ఆయనకు భరోసా ఇచ్చానని ట్రంప్ తెలిపారు. మిత్రదేశాల భద్రతకు అమెరికా ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ట్రంప్ చెప్పారు. ఇదిలావుంటే, ఉత్తర అమెరికా సైనిక కూటమి (నాటో)కి ట్రంప్ అండగా నిలుస్తారని, ఈ విషయంలో ఆయన నిబద్ధతను ఎవరూ శంకించాల్సిన అవసరం లేదని అమెరికా ఉపాధ్యక్షుడు మైక్ పెన్సీ స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







