ఉగ్రవాదాన్ని ప్రతిఘటించాల్సిందే: డొనాల్డ్ ట్రంప్
- February 18, 2017
ఉగ్రవాదాన్ని ప్రతిఘటించాల్సిందేనని, ఉగ్రవాదులను ఓడించాల్సిందేనని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పునరుద్ఘాటించారు. ఈ లక్ష్యాలను తమ ప్రభుత్వం సాధించగలదన్న నమ్మకం తనకుందని ఆయన స్పష్టం చేశారు. 'ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా అందరికీ ముప్పే. కనుక దీనిని ప్రతిఘటించి ఉగ్రవాదులను ఓడించి తీరాలి' అని శుక్రవారం ఆయన అమెరికా ప్రజలను ఉద్దేశించి చేసిన వారాంతపు రేడియో ప్రసంగంలో పేర్కొన్నారు. గత వారం ఇజ్రాయిల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహుతో భేటీ అయ్యానని, ఇజ్రాయిల్ భద్రతకు అమెరికా కట్టుబడి ఉందని ఈ సందర్భంగా ఆయనకు భరోసా ఇచ్చానని ట్రంప్ తెలిపారు. మిత్రదేశాల భద్రతకు అమెరికా ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ట్రంప్ చెప్పారు. ఇదిలావుంటే, ఉత్తర అమెరికా సైనిక కూటమి (నాటో)కి ట్రంప్ అండగా నిలుస్తారని, ఈ విషయంలో ఆయన నిబద్ధతను ఎవరూ శంకించాల్సిన అవసరం లేదని అమెరికా ఉపాధ్యక్షుడు మైక్ పెన్సీ స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









