ఆఫర్లతో ఆకట్టుకుంటున్న బీఎస్ఎన్ఎల్
- February 19, 2017
హైదరాబాద్ పరిధిలో 9 లక్షల కనెక్షన్లు కలిగిన ప్రభుత్వం రంగ టెలికం సంస్థ బీఎస్ఎన్ఎల్ భలేభలే ఆఫర్లు ప్రకటించింది. ప్రైవేటు ఆపరేటర్లకు దీటుగా వినియోగదారులను ఆకర్షించేందుకు తాజా వివిధ రకాల ఆఫర్లుతో ముందుకొచ్చింది. ఇవే ఆ ప్లాన్లు.. 'ఆల్ ఫ్రీ ప్లాన్' పేరుతో రూ.144 వోచర్తో 30 రోజుల కాలపరిమితితో అన్ని నెటవర్క్లకు రోజుకు అరగంటపాటు ఉచితంగా మాట్లాడుకోవచ్చు. అదే రూ.439 వోచర్తో 90 రోజుల వరకు ఈ ఆఫర్ను ఉపయోగించుకోవచ్చు. ఆఫర్ మార్చి 31 వరకు అందుబాటులో ఉంటుంది. రూ.339తో 28 రోజుల కాల పరిమితితో స్పెషల్ టారిఫ్ వోచర్ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ఆఫర్ కింద అన్ని నెట్వర్క్లకు ఉచితంగా కాల్స్ చేసుకోవచ్చు.
అంతేకాక 1 జీబీ డేటాను కూడా ఉపయోగించుకోవచ్చు. అదే రూ.139 వోచర్పై అయితే 300 ఎంబీ ఉచిత డేటాతోపాటు సేమ్ నెట్వర్క్కు అపరమిత కాల్స్ చేసుకోవచ్చు. మార్చి 17 వరకు ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది. అలాగే వివిధ రీచార్జ్ వోచర్లపై అదనపు టాక్టైం అందిస్తోంది.
వీటితోపాటు రూ. 4498, రూ. 3998, రూ.2798, రూ.1498 వోచర్లపై డబుల్ డేటా అందిస్తున్నట్టు బీఎస్ఎన్ఎల్ ప్రకటించింది. ఈ ఆఫర్ కూడా మార్చి 31 వరకు అందుబాటులో ఉంటుంది.
అలాగే కాంబో ఆఫర్లు, కొత్త కనెక్షన్లు తీసుకున్న వారి కోసం కూడా బీఎస్ఎన్ఎల్ బంపరాఫర్లు ప్రకటించింది. మరిన్ని వివరాలకు సంస్థ అధికారిక వెబ్సైట్లో సంప్రదించవచ్చు.
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







