ఆఫర్లతో ఆకట్టుకుంటున్న బీఎస్ఎన్ఎల్
- February 19, 2017
హైదరాబాద్ పరిధిలో 9 లక్షల కనెక్షన్లు కలిగిన ప్రభుత్వం రంగ టెలికం సంస్థ బీఎస్ఎన్ఎల్ భలేభలే ఆఫర్లు ప్రకటించింది. ప్రైవేటు ఆపరేటర్లకు దీటుగా వినియోగదారులను ఆకర్షించేందుకు తాజా వివిధ రకాల ఆఫర్లుతో ముందుకొచ్చింది. ఇవే ఆ ప్లాన్లు.. 'ఆల్ ఫ్రీ ప్లాన్' పేరుతో రూ.144 వోచర్తో 30 రోజుల కాలపరిమితితో అన్ని నెటవర్క్లకు రోజుకు అరగంటపాటు ఉచితంగా మాట్లాడుకోవచ్చు. అదే రూ.439 వోచర్తో 90 రోజుల వరకు ఈ ఆఫర్ను ఉపయోగించుకోవచ్చు. ఆఫర్ మార్చి 31 వరకు అందుబాటులో ఉంటుంది. రూ.339తో 28 రోజుల కాల పరిమితితో స్పెషల్ టారిఫ్ వోచర్ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ఆఫర్ కింద అన్ని నెట్వర్క్లకు ఉచితంగా కాల్స్ చేసుకోవచ్చు.
అంతేకాక 1 జీబీ డేటాను కూడా ఉపయోగించుకోవచ్చు. అదే రూ.139 వోచర్పై అయితే 300 ఎంబీ ఉచిత డేటాతోపాటు సేమ్ నెట్వర్క్కు అపరమిత కాల్స్ చేసుకోవచ్చు. మార్చి 17 వరకు ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది. అలాగే వివిధ రీచార్జ్ వోచర్లపై అదనపు టాక్టైం అందిస్తోంది.
వీటితోపాటు రూ. 4498, రూ. 3998, రూ.2798, రూ.1498 వోచర్లపై డబుల్ డేటా అందిస్తున్నట్టు బీఎస్ఎన్ఎల్ ప్రకటించింది. ఈ ఆఫర్ కూడా మార్చి 31 వరకు అందుబాటులో ఉంటుంది.
అలాగే కాంబో ఆఫర్లు, కొత్త కనెక్షన్లు తీసుకున్న వారి కోసం కూడా బీఎస్ఎన్ఎల్ బంపరాఫర్లు ప్రకటించింది. మరిన్ని వివరాలకు సంస్థ అధికారిక వెబ్సైట్లో సంప్రదించవచ్చు.
తాజా వార్తలు
- డిగ్రీ అర్హతతో 216 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు..
- ఫిలిం,టెలివిజన్ హబ్ గా ఏపీ: మంత్రి దుర్గేష్
- అమెరికా చర్యకు పశ్చాత్తాపం తప్పదు: ఇరాన్ విదేశాంగ మంత్రి హెచ్చరిక
- అమెరికా నెక్స్ట్ టార్గెట్ ఈక్వెడార్..ప్రారంభమైన దాడులు
- సెమీస్ పరీక్షకు సిద్ధమైన భారత్..!
- ఖమేనీ అంత్యక్రియల వాయిదా
- తెలంగాణ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు
- బహ్రెయిన్ పై మిస్సైళ్లతో విచుచుకుపడ్డ ఇరాన్..అడ్డుకున్న రక్షణ వ్యవస్థలు..!!
- QR1 మిలియన్ జరిమానా, కంపెనీ సీజ్:ఖతార్
- భారతీయులకు వీసా సరళీకరణను ప్రకటించిన ఒమన్..!!









