గ్రీన్ కార్డు హోల్డర్స్ భయపడక్కర్లేదు
- February 20, 2017
ఏడు ముస్లిం దేశాలను టార్గెట్ గా చేసుకుని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విడుదల చేసిన ఇమ్మిగ్రేషన్ ఆర్డర్ పై ప్రపంచవ్యాప్తంగా నిరసనలు పెల్లుబిక్కిన సంగతి తెలిసిందే. ఈ నిరసనలతో కొంత వెనక్కి తగ్గిన ట్రంప్ మళ్లీ ఇమ్మిగ్రేషన్ పై కొత్త కార్యనిర్వాహక ఆదేశాలను జారీచేస్తానని చెప్పారు. కానీ ట్రంప్ తీసుకురాబోతున్న పునఃసమీక్షించిన ఇమ్మిగ్రేషన్ ఆర్డర్లోనూ మళ్లీ ఆ ఏడు దేశాలనే టార్గెట్ చేశారట. మళ్లీ ఆ ఏడు ముస్లిం దేశాలనే టార్గెట్ చేసిన ట్రంప్ గ్రీన్ కార్డు హోల్డర్స్ ను ఆ నిషేధం నుంచి మినహాయించారని తెలుస్తోంది. ఇప్పటికే వీసా కలిగి ఉన్న వారిని అమెరికాలోకి ప్రయాణించడానికి అనుమతిస్తారని అధికారులు పేర్కొంటున్నారు..
ఒరిజనల్ ఇమ్మిగ్రేషన్ ఆర్డర్ మాదిరిగానే ఇరాన్, ఇరాక్, సిరియా, యెమెన్, సోమాలియా, సూడాన్, లిబియా దేశాల నుంచి వచ్చే ప్రయాణికులను అమెరికాలోకి అనుమతించరని, పునఃసమీక్షించిన ఆర్డర్లోనూ ఈ దేశాలపై నిషేధం కొనసాగుతుందని సీనియర్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు చెబుతున్నారు. అయితే ఈ సారి గ్రీన్ కార్డు హోల్డర్స్ ను, ద్వంద్వ పౌరసత్వం ఉన్నవారిని ఈ నిషేధం నుంచి మినహాయిస్తున్నారని పేర్కొన్నారు.
ప్రస్తుతం డ్రాఫ్ట్ రూపంలో అధికారులందరికీ సర్క్యూలేట్ అయిందని, ఫైనల్ వెర్షన్ త్వరలోనే విడుదల చేస్తామని వైట్ హౌస్ అధికార ప్రతినిధి సారా హకబీ సాండర్స్ చెప్పారు. దీనిపై హోమ్ లాండ్ సెక్యురిటీ డిపార్ట్ మెంట్ వెంటనే స్పందించలేదు. సమీక్షించిన డ్రాఫ్ట్ మళ్లీ ఆ ఏడు దేశాలనే టార్గెట్ చేస్తుందని, కానీ ఈ నిషేధం నుంచి గ్రీన్ కార్డు హోల్డర్స్ ను మినహాయిస్తున్నారని వాల్ స్ట్రీట్ జర్నల్ కూడా రిపోర్టు చేసింది.
తాజా వార్తలు
- 55 రోజుల తర్వాత కువైట్ విమానాశ్రయం పునఃప్రారంభం
- నకిలీ పెట్టుబడి, ట్రేడింగ్ మోసాల పై ప్రజలకు దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- పెట్రోల్ బంకుల్లో ‘నో స్టాక్’ బోర్డులు కనిపించకూడదు: సీఎం చంద్రబాబు
- ఇరాన్ దాడి షాక్…అమెరికా స్థావరాలకు భారీ నష్టం
- చెన్నై పై గుజరాత్ ఘన విజయం
- కరీంనగర్ లో ఘనంగా కుబేర క్లాత్ షోరూం రెండో బ్రాంచ్ ప్రారంభం
- కువైట్లో ఎన్నారై టిడిపి ఆధ్వర్యంలో క్యాన్సర్ బాధిత కార్యకర్తకు ఆర్థిక సహాయం
- ప్రముఖ భారతీయ వ్యాపారవేత్త వాసు ష్రాఫ్ కన్నుమూత
- 2025లో QR 20.98 బిలియన్ల ‘రియల్’ లావాదేవీలు..!!
- వాట్సాప్ ద్వారా డాక్యుమెంట్స్..యూఏఈలో నిషేధం..!!









