అర్జెంటీనాలో బస్సు ప్రమాదం
- February 20, 2017
అర్జెంటీ నాలో బస్సు ప్రమాదం చోటుచేసుకు న్నది. ఈ ఘటనలో 19 మంది ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందారు. ఒక ప్రయాణికుడు మాత్రమే ప్రాణా లతో బయటపడ్డాడు. అతన్ని స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. స్థానిక అధికారులు తెలిపిన వివరాల ప్రకారం... ఆదివారం చిలీ సరిహద్దులోని అర్జెంటీనా ఆండీస్ ప్రాంతంలో ఓ ప్రయివేట్ బస్సు బోల్తా పడింది. దీంతో, బస్సులోని 19 మంది ప్రయాణికులు మృతి చెం దారు. ప్రత్యేక బృందాలు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. మెన్దోజా ప్రావిన్స్ గవర్నర్ అలెజాంద్రో గుల్లె మృతుల కుటుం బాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ఘటనా స్థలంలో కొనసాగుతున్న సహాయక చర్యలను పర్యవేక్షించారు. ప్రమాదానికి దారి తీసిన వివరాలను క్షతగాత్రుడి నుంచి సేకరించినట్టు చెప్పారు. బస్సు డ్రైవర్ ఘాట్ రోడ్డులో వాహనాన్ని అతివేగంగా నడపడంతోనే ఈ ప్రమాదం సంభవించిందని అనుమానిస్తున్నామని అన్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను త్వరలో వెల్లడిస్తామని చెప్పారు.
కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు పోలీసులు తెలిపారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







