అర్జెంటీనాలో బస్సు ప్రమాదం
- February 20, 2017
అర్జెంటీ నాలో బస్సు ప్రమాదం చోటుచేసుకు న్నది. ఈ ఘటనలో 19 మంది ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందారు. ఒక ప్రయాణికుడు మాత్రమే ప్రాణా లతో బయటపడ్డాడు. అతన్ని స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. స్థానిక అధికారులు తెలిపిన వివరాల ప్రకారం... ఆదివారం చిలీ సరిహద్దులోని అర్జెంటీనా ఆండీస్ ప్రాంతంలో ఓ ప్రయివేట్ బస్సు బోల్తా పడింది. దీంతో, బస్సులోని 19 మంది ప్రయాణికులు మృతి చెం దారు. ప్రత్యేక బృందాలు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. మెన్దోజా ప్రావిన్స్ గవర్నర్ అలెజాంద్రో గుల్లె మృతుల కుటుం బాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ఘటనా స్థలంలో కొనసాగుతున్న సహాయక చర్యలను పర్యవేక్షించారు. ప్రమాదానికి దారి తీసిన వివరాలను క్షతగాత్రుడి నుంచి సేకరించినట్టు చెప్పారు. బస్సు డ్రైవర్ ఘాట్ రోడ్డులో వాహనాన్ని అతివేగంగా నడపడంతోనే ఈ ప్రమాదం సంభవించిందని అనుమానిస్తున్నామని అన్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను త్వరలో వెల్లడిస్తామని చెప్పారు.
కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు పోలీసులు తెలిపారు.
తాజా వార్తలు
- కువైట్లో ఎన్నారై టిడిపి ఆధ్వర్యంలో క్యాన్సర్ బాధిత కార్యకర్తకు ఆర్థిక సహాయం
- ప్రముఖ భారతీయ వ్యాపారవేత్త వాసు ష్రాఫ్ కన్నుమూత
- 2025లో QR 20.98 బిలియన్ల ‘రియల్’ లావాదేవీలు..!!
- వాట్సాప్ ద్వారా డాక్యుమెంట్స్..యూఏఈలో నిషేధం..!!
- ఎయిర్ పోర్టుల భద్రతకు సమగ్ర ప్రణాళిక అమలు..!!
- బహ్రెయిన్లో మొట్టమొదటి వర్చువల్ హార్స్ వేలం..!!
- వారంలో 1,077 స్మగ్లింగ్ కేసులు నమోదు: సౌదీ కస్టమ్స్
- సుల్తాన్ తో ఇరాన్ విదేశాంగ మంత్రి భేటీ..!!
- కువైట్ ఎయిర్వేస్ టికెట్లు ఆకస్మిక రద్దు – ప్రయాణికుల ఆందోళన
- యూఏఈ అధ్యక్షుడితో భేటీ అయిన భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్









