2.6 మిలియన్ దిర్హామ్ల దోపిడీ కేసులో గ్యాంగ్ అరెస్ట్
- February 20, 2017
దుబాయ్ పోలీసులు, యూఏఈ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ మరియు ఒమన్ అథారిటీస్తో కలిసి 10 మంది ఆఫ్రికన్ల గ్యాంగ్ని అరెస్ట్ చేయగలిగారు. ఫిబ్రవరి 15, ఓ మనీ ఎక్స్ఛేంజ్పై దాడి చేసిన దుండగులు 3.6 మిలియన్ దిర్హామ్లు దొంగిలించారు. కేవలం 46 గంటల్లోనే ఈ గ్యాంగ్ని పోలీసులు పట్టుకోగలిగారు. దుబాయ్ పోలీస్ అండ్ జనరల్ సెక్యూరిటీ డిప్యూటీ ఛైర్మన్ లెఫ్టినెంట్ జనరల్ దాహి ఖల్ఫాన్ తమీమ్ ఈ ఘటనలో నిందితుల్ని పట్టుకున్నందుకు పోలీసుల్ని అభినందించారు. దోపిడీకి పథకం వేసిన ఆఫ్రికన్ ముఠా, ముందుగా అరబ్ బ్రోకర్ని సంప్రదించి తమ వద్ద డాలర్లున్నాయనీ వాటిని మార్చాల్సి ఉందని తెలపగా, మనీ ఎక్స్ఛేంజ్ అధికారులు ముగ్గుర్ను తీసుకుని హోటల్లో సమావేశమయ్యాడు ఆ బ్రోకర్. ఈ సమయంలోనే ఆయుధాలతో బెదిరించిన ముఠా సభ్యులు, అక్కడినుంచి ఆ సొమ్ముతో పారిపోయారు. బాధితుల్ని గుర్తించిన రూమ్ క్లీనర్ పోలీసులకు సమాచారమివ్వడంతో సకాలంలో పోలీసులు స్పందించారు. ఈ గ్యాంగ్లో ముగ్గురు ఒమన్ పారిపోగా, మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ద్వారా ఒమనీ అధికారుల్ని సంప్రదించి వారిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది.
తాజా వార్తలు
- కువైట్ ఎయిర్వేస్ టికెట్లు ఆకస్మిక రద్దు – ప్రయాణికుల ఆందోళన
- యూఏఈ అధ్యక్షుడితో భేటీ అయిన భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్
- కేరళలో ఘనంగా మొదలైన పూరం సంబరాలు
- యూఏఈ సంచలన నిర్ణయం..50% సేవలు AIతోనే
- ఓడించే పార్టీ విజయ్ టీవీకే!
- ET బిజినెస్ రిఫార్మర్ అవార్డు అందుకున్న సీఎం చంద్రబాబు
- యూపి ట్రిపిల్ మర్డర్: కేక్ పూయడం పై గొడవ..ముగ్గురు స్నేహితుల కాల్చివేత!
- సోషల్ మీడియాలో ఫేక్ వీసా,ఆఫర్లపై అబుదాబి పోలీసుల హెచ్చరిక..!!
- వైట్హౌస్ డిన్నర్ వద్ద కాల్పులు..షూటర్ ఫోటో విడుదల
- ట్రంప్ డిన్నర్ టైంలో కాల్పులు..పరుగులు పెట్టిన సెక్యూరిటీ









