2.6 మిలియన్ దిర్హామ్ల దోపిడీ కేసులో గ్యాంగ్ అరెస్ట్
- February 20, 2017
దుబాయ్ పోలీసులు, యూఏఈ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ మరియు ఒమన్ అథారిటీస్తో కలిసి 10 మంది ఆఫ్రికన్ల గ్యాంగ్ని అరెస్ట్ చేయగలిగారు. ఫిబ్రవరి 15, ఓ మనీ ఎక్స్ఛేంజ్పై దాడి చేసిన దుండగులు 3.6 మిలియన్ దిర్హామ్లు దొంగిలించారు. కేవలం 46 గంటల్లోనే ఈ గ్యాంగ్ని పోలీసులు పట్టుకోగలిగారు. దుబాయ్ పోలీస్ అండ్ జనరల్ సెక్యూరిటీ డిప్యూటీ ఛైర్మన్ లెఫ్టినెంట్ జనరల్ దాహి ఖల్ఫాన్ తమీమ్ ఈ ఘటనలో నిందితుల్ని పట్టుకున్నందుకు పోలీసుల్ని అభినందించారు. దోపిడీకి పథకం వేసిన ఆఫ్రికన్ ముఠా, ముందుగా అరబ్ బ్రోకర్ని సంప్రదించి తమ వద్ద డాలర్లున్నాయనీ వాటిని మార్చాల్సి ఉందని తెలపగా, మనీ ఎక్స్ఛేంజ్ అధికారులు ముగ్గుర్ను తీసుకుని హోటల్లో సమావేశమయ్యాడు ఆ బ్రోకర్. ఈ సమయంలోనే ఆయుధాలతో బెదిరించిన ముఠా సభ్యులు, అక్కడినుంచి ఆ సొమ్ముతో పారిపోయారు. బాధితుల్ని గుర్తించిన రూమ్ క్లీనర్ పోలీసులకు సమాచారమివ్వడంతో సకాలంలో పోలీసులు స్పందించారు. ఈ గ్యాంగ్లో ముగ్గురు ఒమన్ పారిపోగా, మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ద్వారా ఒమనీ అధికారుల్ని సంప్రదించి వారిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది.
తాజా వార్తలు
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!







