2.6 మిలియన్ దిర్హామ్ల దోపిడీ కేసులో గ్యాంగ్ అరెస్ట్
- February 20, 2017
దుబాయ్ పోలీసులు, యూఏఈ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ మరియు ఒమన్ అథారిటీస్తో కలిసి 10 మంది ఆఫ్రికన్ల గ్యాంగ్ని అరెస్ట్ చేయగలిగారు. ఫిబ్రవరి 15, ఓ మనీ ఎక్స్ఛేంజ్పై దాడి చేసిన దుండగులు 3.6 మిలియన్ దిర్హామ్లు దొంగిలించారు. కేవలం 46 గంటల్లోనే ఈ గ్యాంగ్ని పోలీసులు పట్టుకోగలిగారు. దుబాయ్ పోలీస్ అండ్ జనరల్ సెక్యూరిటీ డిప్యూటీ ఛైర్మన్ లెఫ్టినెంట్ జనరల్ దాహి ఖల్ఫాన్ తమీమ్ ఈ ఘటనలో నిందితుల్ని పట్టుకున్నందుకు పోలీసుల్ని అభినందించారు. దోపిడీకి పథకం వేసిన ఆఫ్రికన్ ముఠా, ముందుగా అరబ్ బ్రోకర్ని సంప్రదించి తమ వద్ద డాలర్లున్నాయనీ వాటిని మార్చాల్సి ఉందని తెలపగా, మనీ ఎక్స్ఛేంజ్ అధికారులు ముగ్గుర్ను తీసుకుని హోటల్లో సమావేశమయ్యాడు ఆ బ్రోకర్. ఈ సమయంలోనే ఆయుధాలతో బెదిరించిన ముఠా సభ్యులు, అక్కడినుంచి ఆ సొమ్ముతో పారిపోయారు. బాధితుల్ని గుర్తించిన రూమ్ క్లీనర్ పోలీసులకు సమాచారమివ్వడంతో సకాలంలో పోలీసులు స్పందించారు. ఈ గ్యాంగ్లో ముగ్గురు ఒమన్ పారిపోగా, మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ద్వారా ఒమనీ అధికారుల్ని సంప్రదించి వారిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది.
తాజా వార్తలు
- దుబాయ్ ఎయిర్పోర్ట్లో ఎటువంటి ప్రమాదాలు జరగలేదు: వదంతులను కొట్టిపారేసిన అధికారులు!
- అనుమతి లేకుండా ధరలు మారిస్తే.. QR1,000,000 ఫైన్..!!
- డ్రైవింగ్ చేసేటప్పుడు అత్యవసర హెచ్చరిక వస్తే?
- ఇరాన్ దురాక్రమణ..బహ్రెయిన్కు నాటో మద్దతు..!!
- గల్ఫ్ దేశాలపై ఇరాన్ దాడులు నేపథ్యంలో TGWWC–ఒమాన్ శాఖ అత్యవసర సమావేశం
- నేషనల్ వాటర్ కంట్రోల్ సెంట్రల్ ను సందర్శించిన పీఎం..!!
- ఆఫ్రికన్, మధ్య ఆసియా దేశాలతో ఒమన్ చర్చలు..!!
- రియాద్, జెడ్డా నుండి దుబాయ్ కు ఫ్లైట్స్ పునరుద్ధరణ..!!
- దుబాయ్ లో పబ్లిక్ సేఫ్టీపై కొత్త చట్టం..Dh2 మిలియన్ల ఫైన్..!!
- షార్లెట్లో NATS ఆధ్వరంలో మహిళా దినోత్సవ వేడుకలు









