ఐడీ కార్డు పోయినట్లయితే ఫిర్యాదు తప్పనిసరి
- February 20, 2017
రియాద్: పాస్పోర్ట్ డిపార్ట్మెంట్, రెసిడెంట్స్కి పాస్పోర్ట్ విషయమై స్పష్టమైన ఆదేశాలు, హెచ్చరికలు జారీ చేసింది. పాస్పోర్టులు ముకీమ్ కార్డులు ఒకవేళ పోయినట్లయితే 24 గంటల్లోపు ఫిర్యాదు చేయాలనీ లేని పక్షంలో 1,000 సౌదీ రియాల్స్ నుంచి 3,000 సౌదీ రియాల్స్ వరకు జరీమానా తప్పదని పేర్కొన్నారు అధికారులు. నాన్ సౌదీస్ తమ ముకీమ్ కార్డుల్ని గడువు లోపల రెన్యువల్ చేయించుకోవాల్సి ఉంటుంది. బ్యాంకుల్లో ముందుగా పీజు చెల్లించి, మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ వెబ్సైట్లో రెన్యువల్ చేయించుకోవాలి. గడువు తీరిన ముకీమ్ కార్డుని కలిగి ఉంటే డిపార్ట్మెంట్ సర్వీసులు లభించవు, అలాగే 500 సౌదీ రియాల్స్ జరీమానా తప్పదు. ముకీమ్ కార్డు, రెసిడెన్సీ లైసెన్సుగా ఉపయోగపడ్తుంది. రెండేళ్ళ క్రితం దీన్ని అమల్లోకి తెచ్చారు. ఆన్లైన్ ద్వారా ఇది రెన్యువల్ చేసుకోవచ్చు.
తాజా వార్తలు
- క్షతగాత్రులను పరామర్శించిన యుఏఈ అధ్యక్షుడు
- దుబాయ్ ఎయిర్పోర్ట్లో ఎటువంటి ప్రమాదాలు జరగలేదు: వదంతులను కొట్టిపారేసిన అధికారులు!
- అనుమతి లేకుండా ధరలు మారిస్తే.. QR1,000,000 ఫైన్..!!
- డ్రైవింగ్ చేసేటప్పుడు అత్యవసర హెచ్చరిక వస్తే?
- ఇరాన్ దురాక్రమణ..బహ్రెయిన్కు నాటో మద్దతు..!!
- గల్ఫ్ దేశాలపై ఇరాన్ దాడులు నేపథ్యంలో TGWWC–ఒమాన్ శాఖ అత్యవసర సమావేశం
- నేషనల్ వాటర్ కంట్రోల్ సెంట్రల్ ను సందర్శించిన పీఎం..!!
- ఆఫ్రికన్, మధ్య ఆసియా దేశాలతో ఒమన్ చర్చలు..!!
- రియాద్, జెడ్డా నుండి దుబాయ్ కు ఫ్లైట్స్ పునరుద్ధరణ..!!
- దుబాయ్ లో పబ్లిక్ సేఫ్టీపై కొత్త చట్టం..Dh2 మిలియన్ల ఫైన్..!!









