ఏపీలో కేసీఆర్కు గ్రాండ్ వెల్క్ం..!!
- February 20, 2017
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తిరుమల పర్యటన సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం భారీ భద్రతా ఏర్పాట్లు చేసింది. కేసీఆర్కు స్వాగతం పలుకుతూ ఆయన అభిమానులు తిరుపతి నగరంలో పెద్ద ఎత్తున బ్యానర్లు, పోస్టర్లు ఏర్పాటు చేశారు.తెలంగాణ ఏర్పాటుకు సంబంధించి ప్రత్యేక మొక్కులను చెల్లించుకునేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ తిరుమల వెళుతున్నారు. ప్రత్యేక విమానంలో రేపు సాయంత్రం ఆయన రేణిగుంట చేరుకుంటారు.
అక్కడ నుంచి సాయంత్రం 6.30 గంటలకు ఆయన తిరుమల వెళతారు.
ఎన్నికల కోడ్ కారణంగా పోలీసులు పోస్టర్లను తొలగించినా, తెలంగాణ ముఖ్యమంత్రిపై గౌరవంతో గోడలకు అతికించిన స్వాగత పోస్టర్లను అలాగే వదిలేశారు. కేసీఆర్ పర్యటన సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం, టీటీడీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ముఖ్యమంత్రి హోదాలో కేసీఆర్ తొలిసారి తిరుమల వస్తుండటంతో... ఆయనను ప్రత్యేక అతిథిగా పరిగణించాలని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం టీటీడీ అధికారులను ఆదేశించింది.
తెలంగాణ ఉద్యమ కాలంలో ప్రత్యేక రాష్ట్రం అవిర్భవిస్తే సాలగ్రామ హారం, కంఠాహారం కానుకలుగా సమర్పించుకుంటానని కేసీఆర్ మొక్కుకున్నారు. ఆ కోర్కె నెరవేరడంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరపున శ్రీవారికి సాలగ్రామహారం, కంఠహారం సమర్పించుకోవడానికి మంగళవారం కుటుంబ సమేతంగా ఆయన తిరుమలకు వస్తున్నారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







