గీతామాధురి సాంగ్ని లాంచ్ చేసిన సునీల్
- February 20, 2017
ఆర్ 4 ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై `ప్రేమిస్తే`, `జర్నీ`, `పిజ్జా` వంటి బ్లాక్బస్టర్లను అందించిన సురేష్ కొండేటి సమర్పణలో రజని రామ్ నిర్మించిన సినిమా -`మెట్రో`. ప్రస్తుతం నగరాలలో జరుగుతున్న చైన్ స్నాచింగ్లను కళ్ళకు కడుతూ.. తెరకెక్కించిన చిత్రమిది. ఈ సినిమాని తెలుగు రాష్ట్రాలలో మార్చి 3న విడుదల చేస్తున్నారు. ఇటీవలే రిలీజ్ చేసిన ట్రైలర్కి, పోస్టర్లకు చక్కని స్పందన వచ్చింది. ప్రఖ్యాత గాయని గీతామాధురి ఈ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. గీతామాధురి సాంగ్ని హీరో సునీల్ ఆవిష్కరించారు.
ఈ సందర్భ ంగా సునీల్ మాట్లాడుతూ -"మహిళలకు రక్షణ కల్పించాలి.. అన్న కాన్సెప్టుతో తెరకెక్కిన ఈ చిత్రాన్ని అందరూ ఆదరించాలి.
చాలా కొత్త పాయింటుతో, చైన్ స్నాచింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాని తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారని కోరుకుంటున్నా" అన్నారు.
సమర్పకుడు సురేష్ కొండేటి మాట్లాడుతూ -"గీతామాధురి తనే స్వయంగా పాడి, తనే నటించిన పాటను హీరో సునీల్ ఆవిష్కరించారు. ఇన్నాళ్లు తెరవెనక గీతామాధురి పాటలు వింటున్నాం. ఇప్పుడు తెరపై తను కనిపించబోతున్నారు. ఇంతవరకూ తెలుగు ఇండస్ట్రీలో రాని కొత్త పాయింటుతో మంచి కాన్సెప్టుతో రూపొందిన ఈ చిత్రాన్ని మార్చి 3న తెలుగు ప్రేక్షకులకు అందించనున్నాం" అని తెలిపారు.
నిర్మాత రజనీ రామ్ మాట్లాడుతూ-"చైన్ స్నాచింగ్ బ్యాక్డ్రాప్లో అద్భుతమైన భావోద్వేగాలతో సాగే చిత్రమిది. గౌతమ్ మీనన్, ఏ.ఆర్.మురుగదాస్ వంటి ప్రముఖుల ప్రశంసలు పొందిన చిత్రమిది. గీతామాధురి సాంగ్ని హీరో సునీల్ ఆవిష్కరించినందుకు ధన్యవాదాలు. మార్చి 3న రిలీజవుతున్న ఈ చిత్రం అందరినీ ఆకట్టుకుంటుందన్న నమ్మకం ఉంది" అన్నారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







