స్కూల్ బస్కి అగ్ని ప్రమాదం: తప్పించుకున్న విద్యార్థులు
- February 21, 2017మనామా: ఇసా టౌన్లో ఎడ్యుకేషన్ ఏరియాలో ఓ బస్సు ప్రమాదవశాత్తూ దహనమైంది. ఈ ప్రమాదంలోంచి 50 మంది విద్యార్థులు తప్పించుకున్నారు. ప్రమాదాన్ని గ్రహించిన డ్రైవర్, చాకచక్యంగా బస్సులోని విద్యార్థుల్ని కిందికి దించివేశాడు. ఇండియన్ స్కూల్ బహ్రెయిన్ వద్ద ఉదయం 7 గంటల సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదని స్కూల్ యాజమాన్యం ప్రకటించింది. సాంకేతిక కారణాల వల్లే బస్సులో అగ్ని ప్రమాదం చోటు చేసుకున్నట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. 80 శాతానికి పైగా బస్సు కాలిపోయింది. ఈ ప్రమాదంతో ఒక్కసారిగా అంతా ఉలిక్కిపడ్డారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







