స్కూల్‌ బస్‌కి అగ్ని ప్రమాదం: తప్పించుకున్న విద్యార్థులు

- February 21, 2017 , by Maagulf

మనామా: ఇసా టౌన్‌లో ఎడ్యుకేషన్‌ ఏరియాలో ఓ బస్సు ప్రమాదవశాత్తూ దహనమైంది. ఈ ప్రమాదంలోంచి 50 మంది విద్యార్థులు తప్పించుకున్నారు. ప్రమాదాన్ని గ్రహించిన డ్రైవర్‌, చాకచక్యంగా బస్సులోని విద్యార్థుల్ని కిందికి దించివేశాడు. ఇండియన్‌ స్కూల్‌ బహ్రెయిన్‌ వద్ద ఉదయం 7 గంటల సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదని స్కూల్‌ యాజమాన్యం ప్రకటించింది. సాంకేతిక కారణాల వల్లే బస్సులో అగ్ని ప్రమాదం చోటు చేసుకున్నట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. 80 శాతానికి పైగా బస్సు కాలిపోయింది. ఈ ప్రమాదంతో ఒక్కసారిగా అంతా ఉలిక్కిపడ్డారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com