'స్పైస్ జెట్' ఎయిర్లైన్స్ వారి గొప్ప ఆఫర్
- February 22, 2017
ప్రయాణికులను ఆకట్టుకొనేందుకు విమానయాన సంస్థలు పోటీపడుతున్నాయి. దీంతో ఆఫర్లమీద ఆఫర్లు ప్రకటిస్తూ ప్రయాణికులను ఆకర్షిస్తున్నాయి. ఇటీవల ఎయిర్ ఆసియా, జెట్ఎయిర్వేస్ సంస్థలు దేశీయ విమానాల్లో తక్కువ ధరలకే విమాన టికెట్లు అందిస్తామని ప్రకటించగా, తాజాగా ప్రముఖ విమానయాన సంస్థ స్పైస్జెట్ ఈ రోజు ‘లక్కీ 7సేల్’ పేరుతో ఓ సరికొత్త పథకాన్ని వెల్లడించింది. అన్ని ఛార్జీలను కలిపి ఒక్కో టికెట్ను కేవలం రూ.777లకే అందించనున్నట్టు తెలిపింది.
ఈ సరికొత్త ఆఫర్ కింద ఈ నెల 22 నుంచి నాలుగు రోజులపాటు టికెట్ల అమ్మకాలు కొనసాగిస్తారు. అయితే, ఒకవైపు ప్రయాణానికి మాత్రమే ఈ ఆఫర్ వర్తించనుంది.
ఈ ఆఫర్లో మార్చి 9 నుంచి ఏప్రిల్ 13 లోపల ప్రయాణానికి మాత్రమే టికెట్లు లభిస్తాయని స్పష్టంచేసింది. టికెట్లను స్పైస్జెట్ అధికారిక వెబ్సైట్ నుంచి లేదంటే ట్రావెల్ ఏజెంట్, ఆన్లైన్ ట్రావెల్ పోర్టల్స్లోనూ పొందవచ్చని స్పైస్జెట్ తెలిపింది. ఆఫర్ కింద పరిమిత సీట్లను కేటాయించినందువల్ల మొదట వచ్చినవారికి ప్రాధాన్యం.. ప్రాతిపదికన టికెట్లు ఇస్తామని తెలిపింది.
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







