'స్పైస్ జెట్' ఎయిర్లైన్స్ వారి గొప్ప ఆఫర్
- February 22, 2017
ప్రయాణికులను ఆకట్టుకొనేందుకు విమానయాన సంస్థలు పోటీపడుతున్నాయి. దీంతో ఆఫర్లమీద ఆఫర్లు ప్రకటిస్తూ ప్రయాణికులను ఆకర్షిస్తున్నాయి. ఇటీవల ఎయిర్ ఆసియా, జెట్ఎయిర్వేస్ సంస్థలు దేశీయ విమానాల్లో తక్కువ ధరలకే విమాన టికెట్లు అందిస్తామని ప్రకటించగా, తాజాగా ప్రముఖ విమానయాన సంస్థ స్పైస్జెట్ ఈ రోజు ‘లక్కీ 7సేల్’ పేరుతో ఓ సరికొత్త పథకాన్ని వెల్లడించింది. అన్ని ఛార్జీలను కలిపి ఒక్కో టికెట్ను కేవలం రూ.777లకే అందించనున్నట్టు తెలిపింది.
ఈ సరికొత్త ఆఫర్ కింద ఈ నెల 22 నుంచి నాలుగు రోజులపాటు టికెట్ల అమ్మకాలు కొనసాగిస్తారు. అయితే, ఒకవైపు ప్రయాణానికి మాత్రమే ఈ ఆఫర్ వర్తించనుంది.
ఈ ఆఫర్లో మార్చి 9 నుంచి ఏప్రిల్ 13 లోపల ప్రయాణానికి మాత్రమే టికెట్లు లభిస్తాయని స్పష్టంచేసింది. టికెట్లను స్పైస్జెట్ అధికారిక వెబ్సైట్ నుంచి లేదంటే ట్రావెల్ ఏజెంట్, ఆన్లైన్ ట్రావెల్ పోర్టల్స్లోనూ పొందవచ్చని స్పైస్జెట్ తెలిపింది. ఆఫర్ కింద పరిమిత సీట్లను కేటాయించినందువల్ల మొదట వచ్చినవారికి ప్రాధాన్యం.. ప్రాతిపదికన టికెట్లు ఇస్తామని తెలిపింది.
తాజా వార్తలు
- హైదరాబాద్: 32 మంది బ్యాంకు అధికారుల అరెస్ట్..
- గచ్చిబౌలిలో భారీ అగ్నిప్రమాదం: 15 బైకులు దగ్ధం
- ఒమన్ గల్ఫ్లో ముదిరిన ఉద్రిక్తతలు
- మలేషియాలో ఘోర అగ్నిప్రమాదం..వెయ్యి ఇళ్లు దగ్ధం
- అమెరికాలో మాస్ షూటింగ్…8 చిన్నారులు మృతి
- ఘర్రాఫత్ అల్ రాయన్ ఇంటర్చేంజ్ వద్ద రోడ్ మూసివేత..!!
- సౌదీ అరేబియాలో ఉరుములతో కూడిన వర్షాలు..!!
- యూఏఈలో నిత్యావసర వస్తువుల ధరలను పోల్చడానికి కొత్త వేదిక..!!
- ఒమన్ మానవ హక్కుల కమిషన్ (OHRC) పునర్నిర్మాణం..!!
- జాతీయ భద్రతా ఉల్లంఘనలపై తక్షణ చర్యలకు ఆదేశాలు..!!









