తీవ్రవాద పేలుడు కారణంగా బహ్రెయిన్ మహిళకు గాయాలు
- February 24, 2017
గత రాత్రి జరిగిన తీవ్రవాద పేలుడు కారణంగా ఓ మహిళ ఒక మోస్తరుగా గాయపడ్డారు. మనామా పశ్చిమ ప్రాంతమైన సానబిస్ గ్రామంలో గురువారం రాత్రి జరిగిన పేలుడులో ఆ మహిళ గాయపడిందని, ఆ వెనువెంటనే సంఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారని అంతర్గత వ్యవహారాల శాఖ తెలిపింది. ఈ ఘటనకు సంబంధించిన ఎటువంటి వివరాలు తెలియరాలేదు. ఆ పేలుడుకి తాము బాధ్యులమని ఏ తీవ్రవాద సంస్థ ప్రకటించుకోలేదు. జరుగుతున్న పలు సంఘటనలు మెజారిటీ భద్రతా దళాలను లక్ష్యంగా చేసుకొని అత్యధిక దాడులు జరుగుతున్నాయని, గత రాత్రి జరిగిన ఈ సంఘటన రెండవదని పదిరోజుల క్రితం ఫిబ్రవరి 14 వ తేదీన జరిగిన దాడిలో సిత్ర ద్వీపంకు చెందిన ఇరువురు పౌరులు గాయపడ్డారని పేర్కొన్నారు. దీనికి ముందు జనవరి 20 వ తేదీన జరిగిన మరొక ఘటనలో పౌరులను లక్ష్యంగా చేసుకొని సార్ ప్రాంతంలో ఒక ఖాళీ వాహనం పేల్చేందుకు పధకం సిద్ధం చేసుకొన్నారని తెలుస్తుంది.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







