తీవ్రవాద పేలుడు కారణంగా బహ్రెయిన్ మహిళకు గాయాలు
- February 24, 2017
గత రాత్రి జరిగిన తీవ్రవాద పేలుడు కారణంగా ఓ మహిళ ఒక మోస్తరుగా గాయపడ్డారు. మనామా పశ్చిమ ప్రాంతమైన సానబిస్ గ్రామంలో గురువారం రాత్రి జరిగిన పేలుడులో ఆ మహిళ గాయపడిందని, ఆ వెనువెంటనే సంఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారని అంతర్గత వ్యవహారాల శాఖ తెలిపింది. ఈ ఘటనకు సంబంధించిన ఎటువంటి వివరాలు తెలియరాలేదు. ఆ పేలుడుకి తాము బాధ్యులమని ఏ తీవ్రవాద సంస్థ ప్రకటించుకోలేదు. జరుగుతున్న పలు సంఘటనలు మెజారిటీ భద్రతా దళాలను లక్ష్యంగా చేసుకొని అత్యధిక దాడులు జరుగుతున్నాయని, గత రాత్రి జరిగిన ఈ సంఘటన రెండవదని పదిరోజుల క్రితం ఫిబ్రవరి 14 వ తేదీన జరిగిన దాడిలో సిత్ర ద్వీపంకు చెందిన ఇరువురు పౌరులు గాయపడ్డారని పేర్కొన్నారు. దీనికి ముందు జనవరి 20 వ తేదీన జరిగిన మరొక ఘటనలో పౌరులను లక్ష్యంగా చేసుకొని సార్ ప్రాంతంలో ఒక ఖాళీ వాహనం పేల్చేందుకు పధకం సిద్ధం చేసుకొన్నారని తెలుస్తుంది.
తాజా వార్తలు
- చర్చలు విఫలమైతే బాంబులే.. ట్రంప్ హెచ్చరిక
- ఇరాన్తో మునుపటి సంబంధాలు అసాధ్యం..!!
- డిఫెన్స్ ఫోర్స్ సన్నద్ధతను సమీక్షించిన కింగ్ హమద్ ..!!
- 1200 ఫ్లైట్స్ నడుపుతున్న జజీరా ఎయిర్వేస్..!!
- సౌదీ అరేబియాలో 1.6% తగ్గిన ప్రాపర్టీ ధరలు..!!
- బర్కాలో ఆసియా దేశస్థుడు అరెస్టు..!!
- ఖతార్కు విదేశీ విమానయాన సంస్థల సేవలు పునరుద్ధరణ..!!
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు









