తీవ్రవాద పేలుడు కారణంగా బహ్రెయిన్ మహిళకు గాయాలు
- February 24, 2017
గత రాత్రి జరిగిన తీవ్రవాద పేలుడు కారణంగా ఓ మహిళ ఒక మోస్తరుగా గాయపడ్డారు. మనామా పశ్చిమ ప్రాంతమైన సానబిస్ గ్రామంలో గురువారం రాత్రి జరిగిన పేలుడులో ఆ మహిళ గాయపడిందని, ఆ వెనువెంటనే సంఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారని అంతర్గత వ్యవహారాల శాఖ తెలిపింది. ఈ ఘటనకు సంబంధించిన ఎటువంటి వివరాలు తెలియరాలేదు. ఆ పేలుడుకి తాము బాధ్యులమని ఏ తీవ్రవాద సంస్థ ప్రకటించుకోలేదు. జరుగుతున్న పలు సంఘటనలు మెజారిటీ భద్రతా దళాలను లక్ష్యంగా చేసుకొని అత్యధిక దాడులు జరుగుతున్నాయని, గత రాత్రి జరిగిన ఈ సంఘటన రెండవదని పదిరోజుల క్రితం ఫిబ్రవరి 14 వ తేదీన జరిగిన దాడిలో సిత్ర ద్వీపంకు చెందిన ఇరువురు పౌరులు గాయపడ్డారని పేర్కొన్నారు. దీనికి ముందు జనవరి 20 వ తేదీన జరిగిన మరొక ఘటనలో పౌరులను లక్ష్యంగా చేసుకొని సార్ ప్రాంతంలో ఒక ఖాళీ వాహనం పేల్చేందుకు పధకం సిద్ధం చేసుకొన్నారని తెలుస్తుంది.
తాజా వార్తలు
- ఖతార్లోని అల్-ఉదీద్ వైమానిక స్థావరంపై డ్రోన్ దాడి..!!
- మనామాలో హోటళ్ళు, నివాస భవనానికి నష్టం..!!
- కువైట్లో చిక్కుకున్న ప్రయాణీకులతో టచ్ లో ఎంబసీ..!!
- మిడిల్ ఈస్ట్, ఒమన్లో CBSE పరీక్షలు రద్దు..!!
- అరబ్ దేశాలపై ఇరాన్ దాడులను ఖండించిన కౌన్సిల్..!!
- యూఏఈలో పరిమితంగా కమర్షియల్ ఫ్లైట్స్ ప్రారంభం..!!
- యూఏఈలోని ఇండియన్ సిలబస్ స్కూళ్లలో ఆన్లైన్లో ఎగ్జామ్స్..!!
- ప్రిన్స్ సుల్తాన్ ఎయిర్ బేస్ పై 3 మిస్సైళ్లతో దాడికి యత్నం..!!
- తెలంగాణకు కొత్త గవర్నర్ గా శివ ప్రతాప్ శుక్లా..
- టీమిండియాదే విజయం..కివీస్తో ఫైనల్ పోరుకు రెడీ..









