కంపెనీని మోసం చేసిన అరబ్ నిర్వాసితుడు జైలు పాలయ్యాడు

- February 25, 2017 , by Maagulf
కంపెనీని మోసం చేసిన అరబ్ నిర్వాసితుడు జైలు  పాలయ్యాడు

కంపెనీ నిధులను తన స్వంత పని నిమిత్తం ఉపయోగించి డబ్బును దుర్వినియోగం చేసిన అరబ్ నిర్వాసిత వ్యక్తికి దోహా మిస్సాదేమీనోరు కోర్టు ఆరు నెలల జైలుశిక్ష మరియు 5,000 ఖతార్ రియాళ్ళ జరిమానాను  విధించింది. ప్రతివాది ఒక మానవ వనరుల అభివృద్ధి సంస్థలో మేనేజర్ గా పనిచేసేవాడని ప్రభుత్వ మరియు ప్రైవేటు కార్యక్రమాలలో అనేక ఉపన్యాసాలు నిర్వహించడానికి  అయిన ఎంతో డబ్బుని ఉపయోగించేవాడని తెలుస్తుంది.అయితే, మానవ వనరుల అభివృద్ధి సంస్థలో మేనేజర్ గా పని చేస్తున్న ఆ వ్యక్తి  ఉద్యోగ ఒప్పందంలో నిబంధనలు మరియు షరతులు ఏమాత్రం  పాటించకపోవడమే కాక , సంస్థ యొక్క డబ్బుని  తన సొంత ఖాతాలోనికి మళ్ళించడం జరిగింది. ఈ విషయం కంపెనీ ఖాతాల యొక్క సాధారణ ఆడిట్ లో నిందితుని చేతివాటం కనుగొనబడింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com