కాల్పులు కాబుల్లో మసీదు వద్ద
- February 25, 2017
- 11 మంది మృతి
కాబుల్: అఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్లో ఓ మసీదుపై దాడి చేసిన మిలిటెంట్లు 11 మందిని హత్య చేశారు. వారిలో 10 మంది పోలీసు అధికారులు కాగా మరొకరు పోలీస్ కమాండర్ భార్య అని అధికారులు వెల్లడించారు. ఉత్తర జావ్జాన్ ప్రావిన్స్లో ఉన్న మసీ దులో పోలీసు అధికారులు ప్రార్థనలు చేసి బయటికి వస్తుండగా వారిపై మిలిటెంట్లు కాల్పులకు పాల్పడ్డారు. తన భర్తపై కాల్పులు జరిగినట్టు తెలుసుకున్న పోలీస్ కమాండర్ భార్య పరుగున అక్కడికి వెళ్లగా ఆమెపై కూడా కాల్పులకు తెగబడ్డారని దీంతో వారంతా అక్కడికక్కడే మృతి చెందారని భద్రతా అధికారి ఒకరు చెప్పారు. ఐఎస్కి చెందిన మిలిటెంట్లు ఈ ఘాతుకానికి పాల్పడ్డారని స్థానిక ప్రభుత్వ అధికారి చెప్పారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







