కాల్పులు కాబుల్‌లో మసీదు వద్ద

- February 25, 2017 , by Maagulf
కాల్పులు కాబుల్‌లో మసీదు వద్ద

- 11 మంది మృతి 
కాబుల్‌: అఫ్ఘనిస్తాన్‌ రాజధాని కాబూల్‌లో ఓ మసీదుపై దాడి చేసిన మిలిటెంట్లు 11 మందిని హత్య చేశారు. వారిలో 10 మంది పోలీసు అధికారులు కాగా మరొకరు పోలీస్‌ కమాండర్‌ భార్య అని అధికారులు వెల్లడించారు. ఉత్తర జావ్జాన్‌ ప్రావిన్స్‌లో ఉన్న మసీ దులో పోలీసు అధికారులు ప్రార్థనలు చేసి బయటికి వస్తుండగా వారిపై మిలిటెంట్లు కాల్పులకు పాల్పడ్డారు. తన భర్తపై కాల్పులు జరిగినట్టు తెలుసుకున్న పోలీస్‌ కమాండర్‌ భార్య పరుగున అక్కడికి వెళ్లగా ఆమెపై కూడా కాల్పులకు తెగబడ్డారని దీంతో వారంతా అక్కడికక్కడే మృతి చెందారని భద్రతా అధికారి ఒకరు చెప్పారు. ఐఎస్‌కి చెందిన మిలిటెంట్లు ఈ ఘాతుకానికి పాల్పడ్డారని స్థానిక ప్రభుత్వ అధికారి చెప్పారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com