అభిమాని సజీవ దహనం, హీరోయిన్ రెజీనా షోరూం ఓపినింగ్ లో దారుణం...
- February 26, 2017
హైదరాబాద్: సినిమా హీరోయిన్లు అంటే అందరకి క్రేజే. వారిని చూసేందుకు అభిమానులు ఎంతగా ఉత్సాహం మనం చిన్నప్పుటినుంచీ చూస్తున్న విషయమే. అయితే అభిమానం కూడా ప్రాణం తీసిందనే విషయాలు వింటనే గుండె తరుక్కుపోతుంది.
శనివారం నాడు గుంటూరులో సినిమా హీరోయిన్ పై ఉండే అభిమానం ఓ యువకుడి ప్రాణం తీసింది. అంతా చూస్తుండగానే అతడు సజీవ దహనమయ్యాడు. వివరాల్లోకి వెళితే... సినీ నటి రెజీనా శనివారం నాడు గుంటూరు నగరంలోని లక్ష్మీపురం మెయిన్ రోడ్డుపై నీరూస్ షోరూమ్ ప్రారంభోత్సవాన్ని ఘనంగా నిర్వహించే ఏర్పాట్లు జరుగుతుండగా అపశ్రుతి చేటుచేసుకుంది. గుంటూరు నగరంలో నీరూస్ షోరూం ప్రారంభానికి వస్తుందని తెలిసి అక్కడికి పెద్దఎత్తున యువకులు చేరుకున్నారు.
ఆ షోరూం ప్రక్కనే పెద్ద ఫ్లెక్సీని కూడా పెట్టారు. యువకులంతా ఒక్కసారిగా అక్కడికి చేరుకోవడంతో కొద్దిపాటి తోపులాట మొదలైంది. ఈ క్రమంలో విజయ్ అనే యువకుడు షోరూం ప్రక్కనే వున్న ఫ్లెక్సీని పట్టుకున్నాడు. ఆ ఫ్లెక్సీ ప్రక్కనే వున్న ట్రాన్సఫార్మర్కు తగులుకోవడంతో విజయ్కు షాక్ కొట్టింది. దాంతో అతడు కిందపడిపోయాడు.
ట్రాన్స్ ఫార్మర్ నుంచి మంటలు చెలరేగి ఫ్లెక్సీకి అంటుకుని అది అతడిపై పడి మంటలు వ్యాపించాయి. అంతా చూస్తుండగానే అతడు సజీవ దహనమయ్యాడు. అతడిని మంటల నుంచి కాపాడేందుకు చేసిన ప్రయత్నం విఫలమైంది. ఈ ప్రయత్నంలో మరో యువకుడు కూడా గాయాలపాలయ్యాడు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
అయితే... మరో వాదన మీడియాలో ప్రచారం అవుతోంది. షోరూమ్ ఓపెనింగ్ కార్యక్రమంలో భాగంగా ఓ భారీ ఫ్లెక్సీ కట్టే ప్రయత్నంలో.. పైనున్న హైటెన్షన్ విద్యుత్ వైర్లు ఫ్లెక్సీకి అమర్చిన ఐరన్ ఫ్రేమ్ కి తగలడంతో కరెంట్ షాక్ కొట్టి మరణించాడంటున్నారు. ఇరవై ఏళ్ళ ఆలేటి మహేష్ అనే యువకుడు దుర్మరణం పాలవటంతో గుంటూరు టౌన్ లో హాట్ టాపిక్ గా మారింది.
ఇదే సమయంలో యువకుడికి కరెంట్ షాక్ తగలగానే.. అక్కడున్న వాళ్ళు కర్రతో ఫ్లెక్సీని పక్కకు లాగే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయింది. ఒక్కసారిగా గాలికి ఆ ఫ్లెక్సీ తిరిగి హైటెన్షన్ తీగలపై పడటంతో మహేష్ శరీరంపై మంటలు చెలరేగి సజీవ దహనమయ్యాడని చెప్తున్నారు.
పిడుగురాళ్లకు చెందిన సదరు యువకుడు మహేష్ తాజా షోరూమ్ ఏర్పాటు చేసిన భవనానికి ఏడాది కాలంగా వాచ్ మెన్ గా ఉంటున్నట్లు తెలుస్తోంది. చివరకు ఇలా మహేష్ హఠాత్పరిణామం కారణంగా మృతి చెందడంతో.. షాప్ ఓపెనింగ్ కోసం ఆహ్వానం మేరకు వస్తోన్న రెజీనా విషయం తెలుసుకుని షాక్ కి గురై వెనుదిరిగినట్లు సమాచారం. చివరగా పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







