భార్య పిల్లల పోషణకై 12 ,000 దిర్హామ్ చెల్లించాలని భర్తకు కోర్టు ఆదేశం

- February 26, 2017 , by Maagulf
భార్య పిల్లల పోషణకై 12 ,000 దిర్హామ్ చెల్లించాలని భర్తకు కోర్టు ఆదేశం

వివాహమై నాలుగేళ్లు పూర్తయి..ఇద్దరు పిల్లలు పుట్టినప్పటికీ పచ్చని సంసారంలో నిప్పులు పోసుకొంటున్నాడా వ్యక్తి. కట్టుకొన్న భార్యని దారుణంగా హింసిస్తుండటంతో విసిగి వేసారిన ఆమె విడాకులు మంజూరు చేయమని కోర్టుని ఆశ్రయించింది. అబూ ధాబీ కస్సాషన్ కోర్టు ఆ వ్యక్తికి తన భార్య నుంచి వేరుపడాలని ఆదేశించింది. అంతేకాకుండా భార్య ఆ వ్యక్తికి చెందిన ఇద్దరు కుమార్తెల పోషణ నిమిత్తం నెలవారీ 12 ,000 దిర్హామ్ లను ఆర్థిక సహాయం చేయాలని ఒక ఇంటిని ఏర్పాటుచేసి పనులు చేసేందుకు ఒక పనిమనిషిని సైతం ఏర్పాటు చేయాలని ఆదేశించింది. తనను నిత్యం చావబాదుతున్నడని..ఏదో ఒకరోజు ప్రాణం పోవడం ఖాయమని..కనుక క్రూరుడైన తన భర్త నుంచి విడాకులు కావాలని కోర్టుకి అరబ్ స్త్రీ మొరపెట్టుకొంది. అయితే, తానూ ఓ మంచి వ్యక్తినని..తాను ఎన్నడూ ఆమెపై చేయి చేసుకోలేదని కోర్టుకి విన్నవించుకున్నాడు. దీనితో ఆమె భర్త చేతిలో తిన్న దెబ్బల తాలూకా గాయాలని అధికారులకు  చూపించింది. అయితే ఆమె భర్తపై దాడి చేసిన నేరంపై ఎటువంటి ఫిర్యాదులు దాఖలు చేయక  అతనిని నుండి విడాకులు పొందడానికి మాత్రం కోర్టు సాయం చేయాలని కోరింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com