రాష్ట్రపతి మెచ్చిన పింక్..
- February 27, 2017
యువతులపై అత్యాచారాల నేపథ్యంతో తెరకెక్కిన హిందీ చిత్రం పింక్. బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ , హీరోయిన్ తాప్సీ ప్రధాన పాత్రలలో తెరకెక్కిన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఈ చిత్రానికి మంచి వసూళ్లు కూడా వచ్చాయి. తాజాగా ఈ మూవీని రాష్ర్టపతి ప్రణబ్ ముఖర్జీ తిలకించారు. రాష్ట్రపతి భవన్ లో ఆయన కోసం పింక్ స్పెషల్ స్క్రీనింగ్ వేసారు. ఈ ప్రదర్శనకు అమితాబ్.. తాప్సిలతో పాటు దర్శకుడు అనిరుధ్ చౌదరి.. నిర్మాత సూర్జిత్ సిర్కార్ తదితరులు హాజరయ్యారు. చిత్రాన్ని వీక్షించిన తర్వాత ప్రణబ్ మూవీతో పాటు టీంపై ప్రశంసల జల్లు కురిపించారు. చిత్రం రాష్ట్రపతిని ఎంతగానో ఇంప్రెస్ చేసిందని అమితాబ్ తన బ్లాగ్ ద్వారా వెల్లడించాడు.
ఇక ప్రదర్శన తర్వాత ప్రణబ్ పింక్ టీం అందరికి గెస్ట్ రూంలో ప్రైవేట్ డిన్నర్ ఇచ్చారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







