రాష్ట్ర‌ప‌తి మెచ్చిన పింక్..

- February 27, 2017 , by Maagulf
రాష్ట్ర‌ప‌తి మెచ్చిన పింక్..

యువ‌తుల‌పై అత్యాచారాల నేపథ్యంతో తెరకెక్కిన హిందీ చిత్రం పింక్. బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బ‌చ్చ‌న్ , హీరోయిన్ తాప్సీ ప్రధాన పాత్రలలో తెరకెక్కిన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఈ చిత్రానికి మంచి వసూళ్లు కూడా వచ్చాయి. తాజాగా ఈ మూవీని రాష్ర్ట‌ప‌తి ప్ర‌ణ‌బ్ ముఖ‌ర్జీ తిలకించారు. రాష్ట్రపతి భవన్ లో ఆయన కోసం పింక్ స్పెషల్ స్క్రీనింగ్ వేసారు. ఈ ప్రదర్శనకు అమితాబ్.. తాప్సిలతో పాటు దర్శకుడు అనిరుధ్ చౌదరి.. నిర్మాత సూర్జిత్ సిర్కార్ తదితరులు హాజ‌ర‌య్యారు. చిత్రాన్ని వీక్షించిన తర్వాత ప్రణబ్ మూవీతో పాటు టీంపై ప్రశంసల జల్లు కురిపించారు. చిత్రం రాష్ట్రపతిని ఎంతగానో ఇంప్రెస్ చేసిందని అమితాబ్ తన బ్లాగ్ ద్వారా వెల్లడించాడు.
ఇక ప్రదర్శన తర్వాత ప్రణబ్ పింక్ టీం అందరికి గెస్ట్ రూంలో ప్రైవేట్ డిన్నర్ ఇచ్చారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com