చిత్రహింసలు పెడుతున్న సేఠ్, సౌదీ చెరలో మరో మహిళ
- February 27, 2017
సౌదీ చెర నుంచి బయటపడి తిరుపతికి చేరు కున్న షెహనాజ్, భువనేశ్వరిల గాయం మానకముందే మరో మహిళ వ్యథ వెలుగులోకి వచ్చింది. రేణిగుంటకు చెందిన అక్తర్ అనే మహిళ సౌదీలో సేఠ్ పెట్టే చిత్రహింసలను భరించలేక భర్తకు ఫోనచేసి విష యం తెలిపింది. తనను ఎలాగైనా ఇండియాకు రప్పించకుంటే.. ఆత్మహత్య చేసుకుంటానని వాపోయింది. ఆందోళనకు గురైన అక్తర్ కుటుంబీకులు.. ఆమెను ఇండియాకు రప్పించాలని ఇటీవల అర్బన్ ఎస్పీ ఆర్.జయలక్ష్మిని కలిసి వేడుకున్నారు.
బాధితుల కథనం మేరకు.. రేణిగుంట బుగ్గవీధిలో దావూద్, అక్తర్ దంపతులు కాపురం ఉండేవారు. వీరికి ఇద్దరు కొడుకులు, ఇద్దరు కుమార్తెలు. రైల్వేస్టేషన్లో టీ అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్న వీరికి ఎడారి దేశం ఆశ చూపింది.
అక్తర్కు అదేవీధిలో కాపురముంటున్న బ్రోకర్ ఎస్.షబానా పరిచయమైంది.డబ్బులు ఇవ్వాల్సిన పనిలేదని నెలనెలా జీతంలో పట్టుకుంటా మని ఒప్పించి.. సౌదీలోని దమామ్కు అక్తర్ను పంపించింది.
ఇలా.. గత ఏడాది ఆగస్టు 23వ తేదీన సౌదీ వెళ్లిన అక్తర్కు రెండు నెలలు మామూలుగానే గడిచిపోయాయి.ఆ తర్వాత సేఠ్ పెట్టే బాధలకు తాళ లేక పోయింది. అక్కడి అఘాయిత్యాలను భర్తకు ఫోన్చేసి చెప్పింది. దీంతో బ్రోకర్ షబానాను అక్తర్ కుటుంబీకులు నిలదీశారు. పంపించే వరకే తన బాధ్యతని ఆమె చేతులెత్తేసింది. అంతగా కావాలంటే రూ.5 లక్షలు ఇస్తే ముంబైలోని బ్రోకర్తో మాట్లాడి ఇండియాకు తీసుకొస్తా మని చెప్పింది. అసలే పేదకుటుంబం.. రూపాయికి ఆశపడి సౌదీకి పోతే, రప్పించడానికి రూ.5లక్షలు అడిగితే ఏంచేయాలో పాలుపోక పోలీసులను ఆశ్రయించారు. వీరిగోడు విన్న ఎస్పీ జయలక్ష్మి రేణిగుంట ఇన్స్పెక్టర్కు రెఫర్ చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేయమన్నారు. రేణిగుంటలో పోలీసులు కేసు అయితే పెట్టారుగానీ.. దర్యాప్తులో మాత్రం వేగం కనిపించడం లేదని అక్తర్ కుటుంబీకులు వాపోతున్నారు. తన భార్యను త్వరగా ఇండియాకు రప్పించే చేయాలని ఎస్పీని దావూద్ వేడుకుంటున్నాడు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







