బహరేన్ లో బస్సు లక్ష్యంగా బాంబు దాడి గాయపడిన ఐదుగురు పోలీసు అధికారులు
- February 28, 2017
దుబాయ్ : బస్సు లక్ష్యంగా ఐలాండ్ నేషన్ లో బాంబు దాడి జరగ్గా ఆ ఘటనలో ఐదుగురు పోలీసు అధికారులు గాయపడ్డారని బహరేన్ అధికారులు తెలిపారు. గాయపడిన వారిలో ఇద్దరిని ఆసుపత్రి నుంచి డిశ్చార్జి చేశారు. మరో ముగ్గురి ఆరోగ్య పరిస్థితి స్థిరమైన రీతిలో ఉందని అంతర్గత మంత్రిత్వశాఖ ఒక ప్రకటనలో తెలిపింది. మతపెద్ద షేక్ ఇసా ఖ్అస్సిమ్ సోమవారం కోర్టుకు హాజరు కావాల్సిన నేపథ్యంలో ఒకరోజు ముందుగా ఆదివారం ఈ దాడి పోలీసులపై జరిగింది. గత ఏడాది జూన్ లో ఆ మతపెద్ద తన పౌరసత్వం కోల్పోయారు. అంతే కాకుండా దేశము నుండి బహిష్కరణకు సైతం గురయ్యారు. మతపెద్ద ఖ్అస్సిమ్ యొక్క తదుపరి విచారణ మార్చి 14 వ తేదీన జరగనుంది.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







