బకింగ్ హాం ప్యాలెస్‌లో భారతీయ నృత్యం

- February 28, 2017 , by Maagulf
బకింగ్ హాం ప్యాలెస్‌లో భారతీయ నృత్యం

బ్రిటన్ రాణి ఎలిజిబెత్‌కు భారతీయ నృత్యాలంటే ఎంతో మక్కువ.  భారత్-యూకె సాంస్కృతిక వార్షికోత్సవం ప్రారంభం సందర్భంగా ఎలిజిబెత్ రాణి ప్రత్యేక విందు ఏర్పాటు చేశారు.  ఈ విందులో భారత ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ, ప్రముఖ నృత్యకారిణి అరుణిమా కుమార్ పాల్గొన్నారు.  ఏకం అనే ప్రత్యేక నృత్య రూపకాన్ని అరుణిమ ప్రదర్శించారు.  భారత దేశం గురించి, సాంస్కృతిక ప్రత్యేకతల గురించి బ్రిటన్ రాణికి చాలా తెలుసునని, అన్ని విషయాలూ అడిగి తెలుసుకోవడం ఆనందం కలిగించిందని అరుణిమ అన్నారు.  భారత కళలను బకింగ్ హం ప్యాలెస్‌కు తీసుకెళ్లగలగడం ఎంతో సంతృప్తినిచ్చిందని అన్నారు. 
 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com