బాలీవుడ్ నటుడు సంజయ్‌దత్ బాడీగార్డ్స్ జర్నలిస్టులను చావబాదారు

- March 03, 2017 , by Maagulf
బాలీవుడ్ నటుడు సంజయ్‌దత్ బాడీగార్డ్స్ జర్నలిస్టులను చావబాదారు

బాలీవుడ్ నటుడు సంజయ్‌దత్ బాడీగార్డ్స్ జర్నలిస్టులను చావబాదారు. సెట్స్‌లో హీరోతో మాట్లాడేందుకు సదరు రిపోర్టర్లు 
మాట్లాడేందుకు ప్రయత్నించిన సందర్భంలో అత్యుత్సాహం ప్రదర్శించి దాడి చేశారు. పరిస్థితి సీరియస్ కావడంతో నేరుగా 
సంజయ్‌దత్ వచ్చి జర్నలిస్టులకు క్షమాపణలు చెప్పాడు.
ఒమంగ్ కుమార్ డైరెక్షన్‌లో సంజయ్‌దత్ 'భూమి' అనే ఫిల్మ్ చేస్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్ ఆగ్రా పరిసర ప్రాంతాల్లో 
జరుగుతోంది. ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించి వివరాలు తెలుసుకునేందుకు లొకేషన్‌కి వెళ్లిన రిపోర్టర్స్‌పై హీరో బాడీగార్డ్స్ చేయి 
చేసుకున్నారు. మరోవైపు తండ్రీ కూతుళ్ల మధ్య కొనసాగే అనుబంధం నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోంది.
ఇందులో 
సంజయ్‌దత్ కూతురిగా అదితీరావు హైదరి కనిపించనుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com