డ్రైవర్ల కోసం ఆర్టిఎ - స్మార్ట్ యార్డ్స్
- March 07, 2017
రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ (ఆర్టిఎ), కొత్తగా స్మార్ట్ యార్డ్ని డ్రైవర్ల పరీక్ష కోసం ఏర్పాటు చేసింది. లైట్ డ్రైవర్ లైసెన్స్ అప్లికెంట్స్ కోసం దుబాయ్ డ్రైవింగ్ సెంటర్, అల్ ఖయిల్ బ్రాంచ్, అల్ కోజ్ ఇండస్ట్రియల్ ఏరియాలో దీన్ని ఏర్పాటు చేశారు. మాన్యువల్ గేర్తో కూడిన వాహనానికి కొత్త టెక్నాలజీని జోడించి ఇక్కడ డ్రైవర్లకు పరీక్షను నిర్వహించడం జరుగుతుంది. దుబాయ్ని స్మార్టెస్ట్ సిటీగా తీర్చిదిద్దడంలో భాగంగా పలు చర్యలు చేపడుతున్నారు. అందులో ఈ స్మార్ట్ డ్రైవర్ టెస్ట్ టెక్నాలజీ కూడా ముఖ్యమైనది. ప్రపంచ వ్యాప్తంగా ఈ తరహా విధానం ఇదే ప్రథమం. పరీక్ష కోసం ఉపయోగించే కారుతోపాటు, యార్డ్కీ అత్యాధునిక సెన్సార్లను అమర్చారు. వాటి ద్వారా అత్యంత ఖచ్చితత్వంతో పరీక్షను నిర్వహించడానికి వీలవుతుంది. ఒకేసారి పలు వాహనాల ద్వారా డ్రైవర్లకు పరీక్షలు నిర్వహించేందుకు వీలుగా టవర్ని ఏర్పాటు చేసి, దాని ద్వారా అత్యంత ఖచ్చితంగా పాస్ అయినవారిని ఎంపిక చేస్తారు.
తాజా వార్తలు
- ట్రక్కుల పై 25 శాతం టారీఫ్లు విధించిన ట్రంప్
- ఈ వీకెండ్ లో కార్నిచ్ స్ట్రీట్ మూసివేత..!!
- కువైట్ లో రోడ్ బ్లాక్ కు భారీ జరిమానాలు..!!
- అల్-ఫలిహ్ నేతృత్వంలో మొరాకోకు సౌదీ ప్రతినిధి బృందం..!!
- బహ్రెయిన్లో SMS స్కామ్.. గైడ్ లైన్స్ రిలీజ్..!!
- ఒమన్ లో తజావోబ్ ప్లాట్ ఫామ్ ప్రారంభం..!!
- యూఏఈలో బివరేజేస్ పై షుగర్ ట్యాక్స్..!!
- 16న PM మోదీ చేతుల మీదుగా డ్రోన్ సిటీకి శంకుస్థాపన: సీఎం చంద్రబాబు
- విశాఖలో మైండ్ స్పేస్ బిజినెస్ పార్క్ ఏర్పాటు చేయండి: మంత్రి లోకేశ్
- సీఎం రేవంత్ చేతుల మీదుగా ఆర్టీఐ కొత్త లోగో