శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో బంగారం పట్టివేత
- September 23, 2015
శంషాబాద్ ఎయిర్పోర్టులో మరో సారి అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని పట్టుకున్నారు. దుబాయ్ నుంచి హైదరాబాద్కు వచ్చిన ఒక జంటను కస్టమ్స్ అధికారులు అతనిని తనిఖీ చేశారు. వారి వద్ద ఆభరణాల రూపంలో బంగారం ఉండటంతో పాటు బంగారం బిస్కట్లు కూడా ఉన్నాయి. వాటిని ఆభరణాలను బిస్కట్లను స్వాధీనం చేసుకున్న పోలీసులు నిందితులను పోలీసు లకు అప్పగించారు. వారి నుంచి స్వాధీనం చేసుకున్న బంగారం ఒక కిలో 76 గ్రాములు ఉన్నట్లు అధికా రులు తెలిపారు. కాగా ఈ విధంగా శంషాబాద్ ఎయిర్ పోర్టు ద్వారా బంగారం స్మగ్లింగ్ జరగడం పరి పాటిగా మారింది. దీంతో స్మగ్లింగ్పై పూర్తి నియంత్రణ తెచ్చేందుకు కస్టమ్స్ అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. అయితే దక్షణ భారత దేశంలో స్మగ్లింగ్కు అనుకూలమైన అంతర్జాతీయ విమానాశ్రయాలలో శంషాబాదు ఎయిర్ పోర్టు మొదటి స్థానంలో ఉంది. అక్కడి అధికారుల చేతకానితనమా లేక స్మగ్లర్లకు అక్కడ అధికారుల నుంచి సహకారం అందుతుందా, అదీ కాక సాంకేతిక సమస్యలా అన్న దానిపై స్పష్టత లేనప్పటికి శంషాబాద్ ఎయిర్ పోర్టు ద్వారా జరిగి స్మగ్లింగ్లో కేవలం 10 శాతం మాత్రం పట్టుబడుతుందని 90 శాతం యదేశ్చగా మార్కెట్కు తరలుతుందన్న చర్చ సాగుతోంది. ఇప్పటికైనా అక్కడి అధికారులు బంగారం స్మగ్లింగ్కు అరికట్టడంలో తమ సత్తా చాటుకోవాల్సిన అవసరం ఉంది.
తాజా వార్తలు
- యూఏఈ: ప్రయాణికులకు ఓవర్స్టే జరిమానాల మాఫీ
- యూఏఈలో విద్యాసంస్థలకు మార్చి 9 నుంచి స్ప్రింగ్ బ్రేక్ సెలవులు
- నెల్లూరు నుంచి విదేశాలకు.. తీగలాగితే డొంక కదులుతోంది..!
- AIతో రూపొందించిన యుద్ధ వీడియోలపై ఎక్స్ కఠిన చర్యలు
- ఇరాన్ నౌక పై సబ్మెరైన్ దాడి
- యుద్ధంలోకి మమ్మల్ని లాగకండి: స్పెయిన్ ప్రధాని
- జెబల్ అలీ పోర్ట్లో యథావిధిగా కార్యకలాపాలు: భద్రతను కట్టుదిట్టం చేసిన అధికారులు!
- సౌదీలో 4రోజలపాటు ఈద్ అల్ ఫితర్ సెలవులు..!!
- వదంతులు, తప్పుడు వార్తల ప్రచారం పై దుబాయ్ పోలీస్ హెచ్చరిక ...
- చరిత్ర సృష్టించిన టీ20 ప్రపంచకప్









