'మీలో ఎవరు కోటీశ్వరుడు షో'లో పాల్గొన్న రంభ,చెర్రీ
- March 09, 2017
మెగాస్టార్ చిరంజీవి రంభ కాంబినేషన్ లో తెరకెక్కిన హిట్లర్, బావగారు బాగున్నారా, అల్లుడా మజాకా వంటి అనేక సినిమాలు బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్.. కలెక్షన్ల వర్షం కురిపించాయి.. ముఖ్యంగా వీరిద్దరి కాంబినేషన్ లో సాంగ్స్ ఇప్పటికీ ప్రేక్షకులను అలరిస్తూనే ఉంటాయి.. ఇక పవన్ కల్యాణ్ తో , బన్నితో సాంగ్స్ చేసి అలరించింది.. ఈ అచ్చతెలుగు భామ పెళ్లి చేసుకొని సినిమాలకు దూరం అయ్యింది.. కానీ విడాకులు, వరకట్న వేధింపులు వంటి వివాదాలతో వార్తల్లో నిలుస్తూనే ఉన్నది..
కాగా ఈ భామ మెగాస్టార్ చిరంజీవి షో మీలో ఎవరు కోటీశ్వరుడు లో గెస్ట్ గా రామ్ చరణ్ తో కలిసి పాల్గొనడానికి వచ్చింది. దీనికి సంబంధించిన ఓ ఫోటో ఒకటి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.. చిరంజీవి, రామ్ చరణ్ ల మధ్యలో రంభ ఉన్న ఈ ఫోటో లో రంభ 40 ఏళ్ల వయసులో కూడా గ్లామర్ తో మిలమిలా మెరిసిపోతున్నది.. ఇక చరణ్ ఐతే ధృవ సినిమాలో కంటే మరింత స్టైలిస్ గా ఆకట్టుకొనేలా కనిపిస్తున్నాడు.. హోస్ట్ గా చిరంజీవి సూపర్ లుక్ లో అలరిస్తున్నాడు.. మరి ఈ షో ఎప్పుడు ఏ సమయంలో ప్రదర్శిస్తారో ప్రకటించాల్సి ఉంది.. కాగా రామ్ చరణ్ నాగార్జున హోస్ట్ చేసిన మీలో ఎవరు కోటీశ్వరుడు షోకి వచ్చి.. తాను యాక్టింగ్ లోనే కాదు.. జనరల్ నాలెడ్జ్ పై కూడా పట్టుంది అని నిరూపించుకొన్నాడు.. మరి ఈ షోలో ఎంత గెలుచుకొన్నాడో చూడాలి మరి..
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







