'మీలో ఎవరు కోటీశ్వరుడు షో'లో పాల్గొన్న రంభ,చెర్రీ
- March 09, 2017
మెగాస్టార్ చిరంజీవి రంభ కాంబినేషన్ లో తెరకెక్కిన హిట్లర్, బావగారు బాగున్నారా, అల్లుడా మజాకా వంటి అనేక సినిమాలు బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్.. కలెక్షన్ల వర్షం కురిపించాయి.. ముఖ్యంగా వీరిద్దరి కాంబినేషన్ లో సాంగ్స్ ఇప్పటికీ ప్రేక్షకులను అలరిస్తూనే ఉంటాయి.. ఇక పవన్ కల్యాణ్ తో , బన్నితో సాంగ్స్ చేసి అలరించింది.. ఈ అచ్చతెలుగు భామ పెళ్లి చేసుకొని సినిమాలకు దూరం అయ్యింది.. కానీ విడాకులు, వరకట్న వేధింపులు వంటి వివాదాలతో వార్తల్లో నిలుస్తూనే ఉన్నది..
కాగా ఈ భామ మెగాస్టార్ చిరంజీవి షో మీలో ఎవరు కోటీశ్వరుడు లో గెస్ట్ గా రామ్ చరణ్ తో కలిసి పాల్గొనడానికి వచ్చింది. దీనికి సంబంధించిన ఓ ఫోటో ఒకటి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.. చిరంజీవి, రామ్ చరణ్ ల మధ్యలో రంభ ఉన్న ఈ ఫోటో లో రంభ 40 ఏళ్ల వయసులో కూడా గ్లామర్ తో మిలమిలా మెరిసిపోతున్నది.. ఇక చరణ్ ఐతే ధృవ సినిమాలో కంటే మరింత స్టైలిస్ గా ఆకట్టుకొనేలా కనిపిస్తున్నాడు.. హోస్ట్ గా చిరంజీవి సూపర్ లుక్ లో అలరిస్తున్నాడు.. మరి ఈ షో ఎప్పుడు ఏ సమయంలో ప్రదర్శిస్తారో ప్రకటించాల్సి ఉంది.. కాగా రామ్ చరణ్ నాగార్జున హోస్ట్ చేసిన మీలో ఎవరు కోటీశ్వరుడు షోకి వచ్చి.. తాను యాక్టింగ్ లోనే కాదు.. జనరల్ నాలెడ్జ్ పై కూడా పట్టుంది అని నిరూపించుకొన్నాడు.. మరి ఈ షోలో ఎంత గెలుచుకొన్నాడో చూడాలి మరి..
తాజా వార్తలు
- రియాద్లో సాటా ఆధ్వర్యంలో ఘనంగా తెలుగు భాషా దినోత్సవం–TBD సీజన్ 5 విజయవంతం
- గ్లోబల్ విలేజ్ ఆఫర్ల పేరుతో మోసాలు.. దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- నీటి పొదుపు పద్ధతులతో వరి సాగు.. దిగుబడులు పెంచుకోవచ్చు: పెద్దపల్లి కలెక్టర్
- ఏవియేషన్ రంగంలో తెలంగాణ విద్యార్థులకు కొత్త బాటలు
- ఏపీ రవాణా శాఖలో కీలక సవరణలు..
- ఐపీఎల్ 2027 మినీ వేలం ఎప్పుడంటే?
- త్రివర్ణ పతాకంతో మెరిసిన పవన్ సెహ్రావత్, మను భాకర్!
- రష్యాలో గ్రాండ్గా ప్రారంభమైన టీ10 క్రికెట్ లీగ్
- 3 ఏళ్ల బాలుడిపై దాడి.. అబుదాబిలో నానీకి జైలుశిక్ష, ఫైన్..!!
- రియాద్, అల్-ఖర్జ్లో ప్రజలకు సివిల్ డిఫెన్స్ సూచనలు..!!







