దోహాలోని ఇండియన్ ఎంబసీకి 3117 ఫిర్యాదులు
- September 23, 2015
భారత ఎంబసీ యొక్క కమ్యూనిటీ సంక్షేమ విభాగానికి ఇప్పటివరకు 3117 ఫిర్యాదులు అందాయి. 2014లో ఈ సంఖ్య 3943గా వుంది. రాయబారి సంజీవ్ అరోరా, డిప్యూటీ చీఫ్ మిషన్ ఆర్ కె సింగ్ మరియు ఇతర అధికారులు, ఫిర్యాదుదారుల్ని కలుసుకుని, వారి సమస్యల గురించి చర్చించారు. ఖతార్ ప్రభుత్వంతో చర్చించి, సమస్యల పరిష్కారానికి మార్గం కనుగొంటామని ఫిర్యాదుదారులకు అధికారులు హామీ ఇచ్చారు. సెప్టెంబర్ వరకు ఎంబసీలో నమోదైన మరణాల సంఖ్య 11. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు 209 మరణాలు నమోదయ్యాయి. 2014లో ఈ సంఖ్య 279. ఎంబసీ 22 అత్యవసర సర్టిఫికెట్స్ని, టిక్కెట్స్నీ భారతదేశానికి తిరిగి వెళ్ళేందుకోసం జారీ చేసింది. ఎంబసీ అధికారులు తరచుగా కేంద్ర కారాగారాన్ని సందర్శించి, భారతీయ ఖైదీల సమస్యల గురించి తెలుసుకుంటున్నారు. భారతీయ ఉద్యోగుల సంక్షేమానికి దౌత్య కార్యాలయం ఆధ్వర్యంలో పనిచేసే కమ్యూనిటీ సంఘం సెప్టెంబర్ నెలలో నిరాశ్రయులైన వారి కోసం ఐదు విమాన టిక్కెట్లు జారీ చేసిందని అధ్యక్షుడు అరవింద్ పాటిల్ చెప్పారు.
--వి.రాజ్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- యూఏఈ: ప్రయాణికులకు ఓవర్స్టే జరిమానాల మాఫీ
- యూఏఈలో విద్యాసంస్థలకు మార్చి 9 నుంచి స్ప్రింగ్ బ్రేక్ సెలవులు
- నెల్లూరు నుంచి విదేశాలకు.. తీగలాగితే డొంక కదులుతోంది..!
- AIతో రూపొందించిన యుద్ధ వీడియోలపై ఎక్స్ కఠిన చర్యలు
- ఇరాన్ నౌక పై సబ్మెరైన్ దాడి
- యుద్ధంలోకి మమ్మల్ని లాగకండి: స్పెయిన్ ప్రధాని
- జెబల్ అలీ పోర్ట్లో యథావిధిగా కార్యకలాపాలు: భద్రతను కట్టుదిట్టం చేసిన అధికారులు!
- సౌదీలో 4రోజలపాటు ఈద్ అల్ ఫితర్ సెలవులు..!!
- వదంతులు, తప్పుడు వార్తల ప్రచారం పై దుబాయ్ పోలీస్ హెచ్చరిక ...
- చరిత్ర సృష్టించిన టీ20 ప్రపంచకప్









