ప్రైవేటు సంస్థల్లో 2,06,00 ఒమానియన్లు
- September 23, 2015
ప్రైవేటు సంస్థల్లో పనిచేస్తున్న భీమా పొందిన ఒమానియన్స్ సంఖ్యలో 0.1శాతం వృద్ధి కన్పిస్తోందని అధికారిక లెక్కలు వెల్లడించాయి. గత జులైలో లెక్కించబడినదాన్ని బట్టి చూస్తే 2,06,348కి ఒమానియన్ కార్మికుల సంఖ్య తేలింది. జాతీయ గణాంకాల సమాచారం ఈ లెక్కల్ని వెల్లడించింది. ఇందులో 1,58,950 మంది పురుషులు కాగా, 47,398 మంది స్త్రీలు. 62,461 మందికి 325 నుంచి 400 ఓఎంఆర్ (ఒమాన్ రియాద్) జీతంగా అందుతోంది. ఈ కేటగిరీలోని వారి సంఖ్య సగం శాతం తగ్గినట్లు తెలుస్తోంది. 400 నుంచి 500 ఒమన్ రియాద్ జీతంగా అందుకుంటున్నవారి సంఖ్యలో మార్పులేదు. ఈ సంఖ్య 46,567గా వుంది. 500 నుంచి 600 జీతం అందుకుంటున్నవారి సంఖ్య 20,640. 600 నుంచి 700 మధ్య జీతం అందుకుంటున్నవారి సంఖ్య 13,677. 700 నుంచి 800 అందుకుంటున్నవారి సంఖ్య 8,976. 800 నుంచి 900 అందుకుంటున్నవారి సంఖ్యలో ఒక శాతం పెరుగుదల కన్పించింది. ఈ సంఖ్య 6,601గా వుంది. 900 నుంచి 1000 అందుకుంటున్నవారి సంఖ్య 4944గా వుంది. 1000 నుంచి 2000 జీతం అందుకుంటున్నవారి సంఖ్యలో 0.3 శాతం పెరుగుదల ననమోదైంది. వీరి సంఖ్య 18,125. 2000 కన్నా ఎక్కువ జీతం అందుకుంటున్నవారి సంఖ్య 7,064. అయితే ఇందులో 5.1 శాతం తగ్గుదల నమోదైంది.
--నూనె లెనిన్ కుమార్(ఒమాన్)
తాజా వార్తలు
- ఏపీకి రెయిన్ అలర్ట్..ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..
- ఇరాన్ డ్రోన్ దాడుల్లో గాయపడిన సైనికులను పరామర్శించిన కువైట్ ఆర్మీ చీఫ్
- ‘అమృత్ భారత్’ రైల్వే స్టేషన్లు ప్రారంభించిన ప్రధాని మోదీ
- మోదీ, చంద్రబాబు పాలనను ప్రశంసించిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్
- ఇరాన్ వైమానిక దాడులను భగ్నం చేసిన బహ్రెయిన్ రక్షణ దళం
- ఇరాన్ దాడితో కువైట్ విద్యుత్, నీటి డిస్టిలేషన్ ప్లాంట్కు నష్టం
- తిరుమలలో భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి 30 గంటల నిరీక్షణ
- అమ్మ, నాన్నల ప్రోత్సాహంతో నీట్ లో 423 ర్యాంక్
- 230 కి.మీ. వేగంతో దూసుకెళ్లిన డ్రైవర్.. 50 వేల దిర్హామ్ జరిమానా..!!
- సౌదీ అరేబియాలో ఇద్దరు యెమెన్ ప్రవాసులు అరెస్ట్..!!







